భుజాల మీదే శవమయ్యాడు!
Published Wednesday, 31 August 2016కాన్పూర్, ఆగస్టు 30:వైద్యో నారాయణో హరి..ప్రాణ భిక్ష పెట్టే వైద్యుడు దేవుడితో సమానమన్న మాట. ఆ మాటకొస్తే వైద్య కేంద్రాలన్నీ దేవాలయాలే..దేవుళ్లతో సమానమైన వైద్యులతో నిండినవే! కానీ ఓ తండ్రి తన పనె్నండేళ్ల కొడుకును కాపాడాలంటూ వైద్యుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక పోయింది. కొడుకు పరిస్థితి క్షణక్షణానికీ క్షీణించడంతో అతడ్ని భుజాన వేసుకుని మరీ రోడ్లపై పరుగులు పెట్డాడు. చివరికి వైద్యుడు కరుణించక..తండ్రి భుజాల మీదే ఆ కొడుకు కన్నుమూశాడు! ఈ హృదయ విదారక ఘటన కాన్పూర్లో జరిగింది.