20నుంచి అసెంబ్లీ
Published Wednesday, 31 August 2016హైదరాబాద్, ఆగస్టు 30: శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 20నుంచి నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి) నిర్ణయించింది. వర్షాకాల సమావేశాలు పది పని దినాలకు తగ్గకుండా నిర్వహించాలని కూడా ప్రభుత్వం వెల్లడించింది. జిఎస్టీ బిల్లు ఆమోదానికి అసెంబ్లీ ప్రత్యేకంగా మంగళవారం సమావేశమైంది. బిల్లు ఆమోదం తర్వాత సభను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అరగంటపాటు వాయిదావేసి తన ఛాంబర్లో బిఏసి నిర్వహించారు.