ఆదుకోండి!
Published Saturday, 2 July 2016న్యూఢిల్లీ, జూలై 1:ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకొని గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి శుక్రవారం కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, ఉమాభారతి, రాజ్నాథ్ సింగ్లతో సమావేశమై చర్చలు జరిపారు.