రిజర్వేషన్లతో పేద ఓసి విద్యార్థులకు తీవ్ర నష్టం
Published Saturday, 2 July 2016సిరిసిల్ల, జూలై 1: విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కారణంగా ఓసి కులాలలోని రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ కులాలలోని పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జిల్లా ఓసి జెఎసి అధ్యక్షులు చెన్నమనేని పురుషోత్తంరావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం టిఎస్ ఓసి జెఎసి విద్యార్థి (యువసేన) ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సిరిసిల్ల ఆర్య వైశ్య సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జెఎసి అధ్యక్షుడు పురుషోత్తమరావు, రాష్ట్ర సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన ఓసిలకు 19 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.