నేడే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
Published Saturday, 2 July 2016నల్లగొండ, జూలై 1: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మూడు నెలల విరామానంతరం రేపు శనివారం చైర్మన్ నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన సమావేశం కానుంది. మంత్రులు కెటిఆర్, జగదీష్రెడ్డిలు ఈ సమావేశానికి హాజరుకానుండగా వారు ఐదుకోట్ల వ్యయంతో నిర్మించే జిల్లా పరిషత్ నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొంటారు. కాగా జిల్లా ప్రజల సమస్యలపై వాడివేడి చర్చలతో దద్ధరిల్లిపోయే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు గత రెండేళ్లుగా మొక్కుబడిగా నామమాత్ర చర్చలకే పరిమితమవుతుండటం విమర్శలకు గురవుతుంది.