11 నుండి రెండవ విడత హరితహారానికి శ్రీకారం
Published Saturday, 2 July 2016ఆదిలాబాద్, జూలై 1: వచ్చే నెల 11 నుండి రెండవ విడత హరితహారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని, ఇందుకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు గావించాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడీవోలు, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హరితహారం, ఓడిఎఫ్, అమ్మనాన్నకు చదువు, ఇంకుడు గుంతలు మొదలగు అంశాలపై మండలాలవారీగా కలెక్టర్ సమీక్షించారు. హరితహారం పథకం విజయవంతం చేసేందుకు గ్రామ స్థాయిలో హరితరక్షణ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, మొక్కలు నాటుటకు గుంతలుతీసి సిద్దంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.