S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జనతాగ్యారేజ్’ సెట్‌లో నితిన్

ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జనతాగ్యారేజ్’ సెట్‌లో ‘అఆ’ హీరో నితిన్ ప్రత్యక్షమయ్యాడు. గ్యారేజ్ చిత్రంకోసం ఎన్టీఆర్ చేస్తున్న డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేశానంటూ సామాజిక మాధ్యమంలో నితిన్ కామెంట్స్ పోస్ట్ చేశాడు. పనిలోపనిగా ఎన్టీఆర్‌తో కలసి తీసుకున్న ఓ ఫొటోనూ జతపరిచాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంత ప్రధాన కథానాయికగా నటిస్తుండగా నిత్యామీనన్ కూడా ఓ పాత్రలో కన్పిస్తుంది.

మహేష్-సూర్య మల్టీస్టారర్?

‘బాహుబలి’ని తలదనే్న మల్టీస్టారర్ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. ఇప్పటివరకు భారత సినిమా చరిత్రలో ‘బాహుబలి’ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటిన సినిమా అది. పైగా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. అయితే అదే స్థాయిలో భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు బాబహుబలిని మించిన సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో వున్నాడు దర్శకుడు సుందర్.సి. ఈ చిత్రంలో సౌత్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూర్య కలిసి నటిస్తారని తెలిసింది. ఇటీవలే ఈ విషయంపై ఖుష్బు ట్విట్టర్‌లో న్యూస్ పెట్టింది.

బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం : క్రిష్

ఇప్పటివరకు 99 సినిమాలు కథానాయకుడిగా పూర్తిచేసి 100 సినిమా మైలురాయిని దాటబోతున్న బాలకృష్ణ చిన్న పిల్లల మనస్తత్వంతోనే ఉన్నారని, విద్యార్థిలాగా షూటింగ్‌లో అన్నీ నేర్చుకుంటారని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ దర్శకుడు క్రిష్ తెలిపారు. నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌లోని బసవరామ తారకం కేన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ తనయ బ్రహ్మణి అభిమానుల మధ్య జన్మదినోత్సవ కేక్‌ను కట్‌చేసి కేన్సర్ బాధితులైన చిన్నపిల్లలకు తినిపించారు. ఇంకా క్రిష్ మాట్లాడుతూ..

17న రానున్న జెంటిల్‌మేన్

నాని, సురభి, నివేదా థామస్ ప్రధాన తారాగణంగా శ్రీదేవి మూవీస్ పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ రూపొందించిన జెంటిల్‌మెన్ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన పాటలకు, టీజర్‌కు, ట్రైలర్లకు మంచి స్పందన లభించిందని, సెన్సార్‌వారు క్లీన్ యు సర్ట్ఫికెట్ ఇచ్చి సినిమాను అభినందించారని తెలిపారు. కుటుంబమంతా కలసి చూడదగిన విధంగా తెరకెక్కిన ఈ చిత్రానికి జెంటిల్‌మెన్ అనే పేరు ఎందుకు పెట్టాము అనేది సినిమా చూసే తెలుసుకోవాలని ఆయన అన్నారు.

వెంకి అతిథిగా ప్రేమమ్

నాగచైతన్య కథానాయకుడుగా చందు మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రూపొందిస్తున్న ప్రేమమ్ చిత్రంలో హీరో వెంకటేష్ ఓ అతిథి పాత్రలో నటించనున్నారు. మలయాళంలో విజయవంతమైన ప్రేమమ్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్యకు కథానాయికలుగా శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా శబాస్టియన్ నటిస్తున్నారు. ప్రేమ కథలలో ఓ వైవిధ్యాన్ని చూపించిన ప్రేమమ్ చిత్రం తెలుగులో కూడా అంతే స్థాయిలో రూపొందుతోందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ నటించనున్న పాత్ర ఎలా ఉంటుందోనని ఇప్పటికే ఆయన అభిమానులలో అంచనాలు పెరిగాయి.

రాకేశ్‌శర్మ జీవితకథలో అమీర్!

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో ప్రయోగానికి సిద్ధం అయ్యాడు? ఇంతకీ ఆయన చేసే ప్రయోగం ఏంటో తెలుసా? ఈసారి ఆయన ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవిత కథలో కనిపిస్తాడట! అవును, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ కూడా జరుగుతోంది. మొత్తానికి ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది మొదటి స్పేస్ మూవీ అవుతుంది. రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు. 1984 ఏప్రిల్ 3న రష్యాకు చెందిన ‘సోయజ్ 11’ అనే రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లాడు. ఆయన జీవితం దేశానికి గర్వకారణంగా నిలిచింది.

50 రోజులు దాటిన సరైనోడు

అల్లు అర్జున్ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ రూపొందించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై 50 రోజులు దాటింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ వేసవి కానుకగా విడుదల చేసిన ‘సరైనోడు’ అన్ని కేంద్రాల్లో అద్భుత విజయం సాధించిందని, అల్లు అర్జున్ మెచ్యుర్డ్‌గా ఈ సినిమాలో నటించాడని తెలిపారు. బోయపాటికి మాస్ పల్స్ బాగా తెలుసని, ఈ చిత్రంతో మరోసారి రుజువైందని, ఆడియో సినిమా విజయానికి ప్లస్ అయిందని అన్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్‌లు పోటాపోటీగా నటిస్తే బ్రహ్మానందం, విద్యుల్లేఖ రామన్ కామెడీ కుటుంబ ప్రేక్షకులకు నచ్చిందని తెలిపారు.

కామెడీ పోలీస్‌గా శర్వానంద్

శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శర్వానంద్ కథానాయకుడిగా చంద్రమోహన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తిచేశారు. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ, వినూత్నమైన కథలతో మంచి సినిమాలు అందిస్తున్న శర్వానంద్‌తో తాము ఈ చిత్రంలో వినోదభరితమైన పోలీస్‌గా చూపుతున్నామని, నూతన దర్శకుడు చంద్రమోహన్ ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ను ఈ నెల 15నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు.

Pages