వైద్యుల రిటైర్మెంట్ వయసు 65
Published Monday, 6 June 2016విజయనగరం, జూన్ 5: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులల్లో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ళకు పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్య సంఘాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ విషయంలో ముఖ్యమంత్రి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విజయనగర పట్టణంలో ప్రభుత్వ ఘోషా ఆసుపత్రిలో పదికోట్ల రూపాయలతో ఆధునీకరించిన భవన సముదాయాన్ని మంత్రి కామినేని ఆదివారం ప్రారంభించారు. 1.06 కోట్ల రూపాయలతో నిర్మించే బాలుర సత్వర చికిత్స కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు.