నేడు ఢిల్లీకి హరీశ్ బృందం
Published Monday, 6 June 2016హైదరాబాద్, జూన్ 5:కృష్ణా బోర్డు వివాదాన్ని తెలంగాణ ప్రభుత్వం సోమవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకు వెళ్లనుంది. నీటిపారుదల మంత్రి హరీశ్రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కె జోషి, టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యుల బృందం సోమవారం సాయంత్రం నాలుగున్నరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశం అవుతుంది. కృష్ణా బోర్డు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని వారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువస్తారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే నీటివాటా పంపిణీ జరుగుతుందని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టులవారీగా తెలంగాణ వాటా తేల్చాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది.