జైళ్ల ద్వారా ప్రభుత్వానికే నిధులు
Published Monday, 6 June 2016సంగారెడ్డి, జూన్ 5: ప్రభుత్వం అందించే నిధుల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ఆర్థిక వనరులను కల్పించే కొత్త పారిశ్రామిక విధానం ద్వారా జైళ్లను అభివృద్ధి చేసి భవిష్యత్తులో ప్రభుత్వానికే నిధులు సమకూర్చే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జైళ్ల శాఖ డిజి వికె.సింగ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఆదివారం జైలు మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిజి మాట్లాడుతూ, తమ శాఖను అన్ని విధాలుగా అమలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.