నీటి వాటాను సాధిస్తాం: కడియం
Published Monday, 6 June 2016హైదరాబాద్: నీటివనరుల కేటాయింపుల్లో తెలంగాణకు సమైక్యపాలనలో తీరని అన్యాయం జరిగినందునే ఇరిగేషన్ ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేస్తున్నామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. నదీ జలాల్లో న్యాయమైన వాటా కోసం తాము పోరాడతామని, న్యాయబద్ధంగా రావాల్సిన నీటివాటాను సాధించి, కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టులపై ఎపి సర్కారు అభ్యంతరాలను ఎదుర్కొంటామన్నారు.