డిజిటల్ సేవల్లో భారత్ దూకుడు
Published Sunday, 5 June 2016కాకినాడ, జూన్ 4: డిజిటల్ ఇండియాతో భారత్ ప్రపంచంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ చెప్పారు. ఈ విధానంతో దేశంలో సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని, నకిలీ రేషన్కార్డులు, ఆధార్ కార్డులను తొలగించామని, వివిధ సంక్షేమ పథకాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అమలుచేస్తున్నట్టు చెప్పారు. కాకినాడ నగరంలో శనివారం జరిగిన సదస్సుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సుదర్శన్ భగత్తో కలసి ఆయన హాజరయ్యారు.