రూ.20వేల కోట్లతో నగరం అభివృద్ధి
Published Sunday, 5 June 2016గచ్చిబౌలి, జూన్ 4: మహానగరాన్ని ఇరవైవేల కోట్ల రూ.లతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అంచనాలు తయారు చేస్తుందని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లిలోని ఖాజగూడ మెయిన్రోడ్డు నుంచి చిత్రపురి కాలనీవరకు రూ.20 లక్షలతో ఏర్పాటుచేసే సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. చిత్రపురి కాలనీ మణికొండ గ్రామ పంచాయతీలో వున్నప్పటికీ శేరిలింగంపల్లి నుంచి కాలనీకి వెళ్లాల్సి వుందని రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారని, మంత్రి కెటిఆర్కు విన్నవించగా జిహెచ్ఎంసి అధికారులతో సంప్రదించి రోడ్డుకి రూ.20 లక్షలు మంజూరు చేసారన్నారు.