ఆంధ్రా అభివృద్ధికి ప్రణాళికలు
Published Sunday, 5 June 2016విజయవాడ (రైల్వేస్టేషన్), జూన్ 4: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని అందుకు కావాల్సిన ప్రణాళికను రూపొందిస్తున్నామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో అడుగిడిన మంత్రి ప్రభు శనివారం భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి శాలువా కప్పారు. అనంతరం ప్రభు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధ్యయనంతో ఆంధ్ర రాష్ట్రం పురోగతి చెందుతుందన్నారు.