అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి
Published Sunday, 5 June 2016హైదరాబాద్, జూన్ 4: హైదరాబాద్లోని దుర్గం చెరువు ప్రాంతం ఆక్రమణలకు గురికావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై తక్షణమే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ చెరువు ఆక్రమణలకు గురైందని పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ చెరువును పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కెప్టెన్ జె.రామారావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.