కార్మికుల సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు
Published Sunday, 5 June 2016హైదరాబాద్, జూన్ 4: కార్మికుల సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎన్డీఏ రెండేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’లో భాగంగా హైదరాబాద్లోని యూసుఫ్గూడలో కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించిన సభకు సినీ, బీడి, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.