మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగానికి తాళం
Published Saturday, 4 June 2016విజయనగరం (్ఫర్టు), జూన్ 3: అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల నేపథ్యంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఉద్యోగులలో గుబులు రేగుతోంది. ప్రతినిత్యం రద్దీగా ఉండే విభాగం గదికి శుక్రవారం తాళాలు వేశారు. గురువారం మధ్యాహ్నం అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు చేయడంతో ఆ విభాగానికి చెందిన అధికారులు, ఉద్యోగులు పత్తా లేకుండా పోయారు. దీంతో ఈ విభాగంలో కీలకమైన రికార్డులు ఉండటంతో తగిన భద్రత కోసం గదికి తాళాలు వేసినట్లు తెలిసింది.