ప్రతి నియోజకవర్గానికి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు
Published Saturday, 4 June 2016శామీర్పేట, జూన్ 3: ప్రతి నియోజకవర్గానికి అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కొల్తూరు, తుర్కపల్లి గ్రామ శివారులోని జీనోమ్ వ్యాలీ పరిసర ప్రాంతంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రాన్ని నాయిని నర్సింహ్మరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల జరిగే నష్టం అంచనా వేయలేమని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.