వర్షం
Published Saturday, 4 June 2016ఎచ్చెర్ల/ఆమదాలవలస/జలుమూరు, జూన్ 3: రోహిణి కార్తెలు కారణంగా భానుడు భగభగలాడటంతో సిక్కోలు వాసులు నిన్నటివరకు విలవిలలాడిపోయారు. అయితే, శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం జిల్లా అంతటా కురిసింది. లావేరు మండలంలో 68.2 మి.మీ ల వర్షం కురిసి అత్యధికంగా నమోదైంది. అలాగే ఇచ్ఛాపురంలో 66.8, అమదాలవలసలో 57.0, శ్రీకాకుళం 56.4, సరుబుజ్జిలి 53.8, కవిటి 50.4, మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 7గంటల నుంచి 10గంటల వరకు ఎడతెరిపిలేని వర్షంకురవడంతో జిల్లాలో 1093.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.