పిడుగుపడి యువకుడి మృతి
Published Saturday, 4 June 2016ఆమదాలవలస, జూన్ 3: మండలంలోగల పెద్దజొన్నవలస గ్రామంలో శుక్రవారం కోట రాజబాబు(18) అనే యువకుడిపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్థులు అందించిన వివరాల ప్రకారం గ్రామంలో అనారోగ్యంతో 90 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందడంతో దహన సంస్కరణలో పాల్గొన్న రాజబాబు కోనాం చెరువులో స్నానం చేసి తిరిగి ఇంటికివస్తుండగా మార్గం మధ్యలో పిడుగుపాటుకు గురయ్యాడు. స్థానికులు ఈ సంఘటన చూసిన వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ రాజబాబు మృతిచెందినట్టు వైద్యాధికారులు తెలిపారు. మృతుడు తల్లిదండ్రులు రమణ, భారతిలు వలస కూలీలు కావడంతో చెన్నైలో ఉంటున్నారు. మృతుడు, తన తమ్ముడు గ్రామంలో ఉంటున్నారు.