టిడిపి రాజకీయ పార్టీ కాదు..పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ
Published Saturday, 4 June 2016కర్నూలు సిటీ, జూన్ 3 : ఎన్టిఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయ పార్టీ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా పేరు మార్చారని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కర్నూలు నగరంలో శుక్రవారం జిల్లా పరిషత్ నుంచి చేపట్టిన ‘గడప గడపకూ సిపిఐ’ కార్యక్రమంలో రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. టిడిపి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి సిఎం చంద్రబాబు సిఇఓ అయితే ఎండిగా సుజనాచౌదరి, డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్గా టిజి.వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ సేల్స్మెన్గా నారాయణ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(పిఆర్ఓ)గా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.