కురిసిన వర్షం..
Published Thursday, 2 June 2016మహబూబ్నగర్, జూన్ 2: జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో గురువారం తెల్లవారుజామున ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లబడిపోయింది. జిల్లాను మేఘాలు దండిగా కమ్ముకున్నాయి. రోహిణి కార్తిలో సమృద్దిగా వర్షాలు కురిస్తే వర్షాధార విత్తనాలు విత్తుకుంటే పంటలు అధిక దిగుబడి వస్తాయని రైతుల నమ్మకం. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 32మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురవడంతో రైతులు ఖరీఫ్ విత్తనాలను తమ పంట పొలాల్లో నాటేందుకు సిద్దం చేసుకుంటున్నారు. నేడో రేపో ఓ భారీ వర్షం కురిస్తే జిల్లా రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కానున్నారు.