S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/18/2019 - 03:30

గోదావరిఖని, మే 17: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం రామగుండం ఎన్టీపీసీకి రానున్నారు. 85వేల కోట్లతో కోటి ఎకరాల తెలంగాణ సాగుభూములకు నీరందించేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన...

05/18/2019 - 03:29

హైదరాబాద్, మే 17: రాష్ట్రంలో అన్ని ఇళ్లకు తాగునీటిని అందించడమే మిషన్ భగరీథ లక్ష్యమని, సమాన స్థాయిలో నీటిని సరఫరా చేయడాన్ని కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ ప్రశంసించారు. రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాలు, తాగునీటి సరఫరా అవుతున్న ఆవాసాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన ఇక్కడ మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డితో సమావేశమయ్యారు.

05/18/2019 - 02:41

రాజాపేట, కడెం, మే 17: వడదెబ్బకు రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన పుప్పాల యాదమ్మ (45) అనే ఉపాధి మహిళా కూలీ శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందింది. ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి సేద తీరే క్రమంలో అస్వస్థతకు గురై మృతి చెందినట్టు స్థానిక సర్పంచ్ పేరుమల్ల కిషన్ తెలిపారు.

05/18/2019 - 02:41

యాదగిరిగుట్ట, మే 17: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు కొనసాగిన స్వామివారి జయంత్యుత్సవాలు శుక్రవారం మహాపూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకాలతో ముగిశాయి. మూడవ రోజు ఉదయం నిత్య హవనం, మూల మంత్ర పారాయణాల అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం పాంచరాత్రగమశాస్త్రానుసారం యాజ్ఞిక, అర్చక బృందం స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

05/18/2019 - 02:38

ధర్మపురి, మే 17: సుప్రసిద్ధ ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శుక్రవారం నరసింహ జయంతి ఉత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం నాడు ఉదయాత్పూర్వం నుండే క్షేత్ర దేవస్థానం లోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

05/18/2019 - 02:31

ఆత్మకూర్, మే 17: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి తాగునీటి నిమిత్తం శుక్రవారం జూరాల అధికారులు నీటిని విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లాకు తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి. గడిచిన నెలరోజులుగా జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా పడిపోవడంతో వనపర్తి, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, అచ్చంపేట, మహబూబ్‌నగర్ తదితర పట్టణాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి.

05/18/2019 - 02:30

మహబూబ్‌నగర్, మే 17: సాగునీటి ప్రాజెక్టుల భూ నిర్వాసితులను ముఖ్యమంత్రి కేసీఆర్ దగా చేస్తున్నారని వారికి రావాల్సిన పరిహారం ఇవ్వడంలో జాప్యం చేయడం ఏమిటని సీఎల్పీ నేత మల్లుభట్టివిక్రమార్క ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా రెండురోజుల పాటు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన శుక్రవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూనిర్వాసితులతో కూడా భేటీ అయ్యారు.

05/18/2019 - 02:28

బొమ్మలరామారం, మే 17: నరహంతకుడు శ్రీనివాస్‌రెడ్డి దారుణ హత్య కేసుల బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, హాజీపూర్ గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నందున శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్ చేయాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్. హన్మంత్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.

05/17/2019 - 13:00

ఆదిలాబాద్: రిమ్స్ ఆసుపత్రి నుంచి దూకి రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తలమడుగు మండలం కజ్జర్లవాసిగా గుర్తించారు. మూడురోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. కిందపడిన అతనిని వెంటనే అత్యవసర విభాగానికి తరలించి చికిత్సచేసినా ప్రయోజనం లేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

05/17/2019 - 04:41

హైదరాబాద్, మే 16: హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. రిసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఫోరమ్ అక్టోబర్ 10న ఇక్కడ సమావేశమై ఆ మరోసటి రోజు అక్టోబర్ 11-12 తేదీలలో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ-2019 సదస్సు జరుగనుంది. తెలంగాణ వాణిజ్య పరిశ్రమలశాఖ, ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ బిజినెస్ స్కూల్, వరల్డ్ డిజైన్ ఆర్గనేజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.

Pages