-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
నాగర్కర్నూల్, మే 15: ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న కేసీఆర్ ఏనాటికైనా జైలుకు వెళ్లాల్సిందేనని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర బుధవారం నాగర్కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చేరుకుంది.
నల్లగొండ టౌన్, మే 15: నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో ఏ-6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ ఉంగరాలు నల్లగొండ జిల్లా జైలులో మాయమైన ఘటనపై జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య బుధవారం విచారణ సాగించారు. జిల్లా జైలును సందర్శించి జైలు అధికారులతో ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
లింగాల, మే 15: పిడుగు పడి రైతు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. లింగాల మండల పరిధిలోని అప్పాయపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో బుధవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షానికి పిడుగుపడి అదే గ్రామానికి చెందిన ఈదమయ్య (35) అనే వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.
సంస్థాన్నారాయణపురం, మే 15: గత దశాబ్ద కాలంగా ఊరిస్తూ వస్తున్న క్షిపణి ప్రయోగకేంద్రం మళ్ళీ తెరపైకి వచ్చింది. గత రెండు రోజులుగా రెవెన్యూ, బీడీఎల్ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో రాచకొండలో పర్యటిస్తున్నారు. గతంలో గుర్తించిన హద్దులను సర్వేయర్ సహాయంతో పరిశీలిస్తున్నారు. ఆరేళ్ళ క్రితం రాజకీయ పార్టీలు, గిరిజనులు ఉద్యమించడంతో బీడీఎల్ అధికారులు తాత్కాలికంగా ప్రతిపాదనను విరమించుకున్నారు.
హైదరాబాద్, మే 15: తెలంగాణలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ఒకే దరఖాస్తుతో ప్రవేశాలు నిర్వహించేందుకు చేపట్టిన దోస్త్ (డైరెక్టు ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. బుధవారం నాడు జరిగిన దోస్త్ కమిటీ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్, మే 15: తెలంగాణ గ్రామీణ పరిపాలనకు సంబంధించిన అంశాలపై దివంగత ప్రొఫెసర్ మారంరాజు సత్యనారాయణరావు చేసిన రచనలు తెలంగాణ ప్రభుత్వానికి ధిక్సూచిగా ఉపయోగపడుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. బుధవారం తెలంగాణ మీడియా అకాడమీలో ప్రొఫెసర్ మారంరాజు సత్యనారాయణరావు రచించిన ‘తెలంగాణ గ్రామాయణం’ పుస్తకాన్ని ఘంటా చక్రపాణి అవిష్కరించారు.
ఉట్నూరు, దండేపల్లి, మే 15 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. ఉట్నూరు మండలం లక్కారం పంచాయతీ పరిధిలోని వేణునగర్కు చెందిన కుర్సింగ కౌసల్య బాయి (62) వడ దెబ్బకు గురై అస్వస్థతకు గురి కాగా, ఆమె కుమారుడు భూమన్న ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని టీఆర్ఎస్ నాయకుడు జావిద్ హన్సారి, తదితరులు పరామర్శించారు.
హైదరాబాద్, మే 15: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకూ పోరాటం ఆగదని అఖిలపక్ష పార్టీల విద్యార్థి, యువజన సంఘాలు స్పష్టం చేశాయి. బుధవారం నాడు ముఖ్దూం భవన్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో విద్యార్థి, యువజన సంగాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే విద్యార్థుల శవాలపై కేసీఆర్ విహార యాత్ర చేస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్, మే 15: రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు ఆహార ధాన్యాలు సరసమైన ధరకు లభించేలా సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. హైదరాబాద్ (జీడిమెట్ల) లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ లో బుధవారం నిర్వహించిన ఉద్యాన పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్, మే 15: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ పంచాయతీకి చెందిన కొట్టాల్ గ్రామ నివాసి బోదాస్ గోపాల్ (48) తన ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చి అక్కడే మరణించడంపై న్యాయవిచారణ జరిపించాలని తెలంగాణ రైతు సంఘం ప్రధానకార్యదర్శి పశ్యపద్మ, నేతలు తోకల రామిరెడ్డి, ఏనుమణిలు రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డిని కోరారు.