S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/12/2018 - 02:20

జగిత్యాల టౌన్, సెప్టెంబర్ 11: కొడిమ్యాల మండలం శనివారం పేట నుంచి కొండగట్టుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడి ఇందులో ప్రయాణిస్తున్న 50మంది మరణించగా మరో 32 మందికి తీవ్రగాయాలు కాగా క్షతగాత్రులకు జిల్లాలోని వివిధ ఆసుపత్రులతోపాటు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

09/12/2018 - 02:18

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణ తదితర అంశాలపై రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించిన ఉన్నతాధికారుల బృందం మంగళవారం సచివాలయంలో అఖిలపక్షం సమావేశం నిర్వహించింది. సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ సాగిన ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై అధికార, విపక్షాలు భిన్నమైన వాదనలు వినిపించాయి.

09/12/2018 - 02:17

హైదరాబాద్, సెప్టెంబర్ 11: జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదంపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే జీ కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర సంతాపాన్ని , విచారాన్ని వ్యక్తం చేశారు.

09/12/2018 - 02:16

వరంగల్, సెప్టెంబర్ 11: వరంగల్ నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక మినీ భారత్ లాంటిదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మంగళవారం మంత్రి వరంగల్ పర్యటనలో భాగంగా నాలుగు భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

09/12/2018 - 02:09

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఎన్నికలకు ముందే పీఆర్‌సి (పే రివిజన్ కమిషన్) సిఫారసులను ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సిబ్బంది, పెన్షనర్స్ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. అపద్ధర్మ ప్రభుత్వం కూడా పీఆర్‌సీని ప్రకటించవచ్చని జేఎసి సూచించింది.

09/12/2018 - 02:07

హైదరాబాద్, సెప్టెంబర్ 11: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ఎంఐఎం నేతలు పలువురు మంగళవారం ఇక్కడ ఎంపి కల్వకుంట్ల కవిత నివాసంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎంఐఎం సీనియర్ నేత షేక్ బాసిత్, మాజీ కౌన్సలర్ షేక్ అలీముద్దీన్, వ్యాపారవేత్త మహమ్మద్ కబీర్ ఉద్దీన్ తదితరులకు ఎంపి కవిత గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

09/12/2018 - 02:05

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ప్రజా గాయకుడు గద్దర్‌తో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు చర్చలు జరిపారు. వీహెచ్ మంగళవారం అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి వెళ్ళారు. గద్దర్ దంపతులు వీహెచ్‌కు స్వాగతం పలికారు. ముందస్తు ఎన్నికల్లో తమతో కలిసి రావాలని వీహెచ్ ఆయనను కోరారు.

09/12/2018 - 02:03

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ధీటైన పోటీ ఇచ్చేందుకు మహాకూటమి ఏర్పాటు దిశగా కాంగ్రెస్, టీడీపీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. కొత్త పొత్తుల గణాంకాలను విశే్లషిస్తున్న నేతలు కాంగ్రెస్, టీడీపీలు కలిసొస్తే టీఆర్‌ఎస్‌కు ముప్పుతప్పదని విశే్లషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకత కలిసొస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

09/12/2018 - 02:02

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అభ్యర్థుల ప్రకటనతో టీఆర్‌ఎస్‌లో పెల్లుబికిన అసమ్మతి నేతల బుజ్జగింపు పర్వం ప్రారంభమైంది. కొంత మంది అసంతృప్తి నేతలకు మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్లు చేసి వారిని బుజ్జగిస్తుండగా, చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు మాత్రం పార్టీ అధినేత, సీఎం కేసీఆరే స్వయంగా ఫోను చేసి హైదరాబాద్‌కు వచ్చి కలువాల్సిందిగా కబురు చేసారు.

09/12/2018 - 02:01

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ముందస్తు ఎన్నికల్లో మహాకూటమికి, అధికార టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ ఈ నెల 11వ తేదీన మార్పు కోసం బీజేపీ శంఖారావం పేరిట మహబూబ్‌నగర్ ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్స్‌లో మహాసభను నిర్వహించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు జాతీయ నాయకులు ఈ సభలో పాల్గొంటున్నారు.

Pages