S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/02/2016 - 01:19

న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశీయ ఐటిరంగ సంస్థ టెక్ మహీంద్ర ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 28 శాతం పెరిగి 796 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో 622 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం ఈసారి 6,920.93 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 6,293.82 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం సంస్థ తెలిపింది.

08/02/2016 - 01:19

లండన్, ఆగస్టు 1: పన్నులు, వడ్డీ మదింపులకు ముందు లాభం ఈ జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో దాదాపు 3,439 కోట్ల రూపాయలు (527.1 మిలియన్ డాలర్లు)గా నమోదైనట్లు వేదాంత రిసోర్సెస్ సోమవారం తెలిపింది. నిరుడుతో పోల్చితే ఇది 18 శాతం తక్కువని, పోయినసారి 644.6 మిలియన్ డాలర్లుగా ఉందని చెప్పింది. ఆదాయం తగ్గడమే లాభాల్లో క్షీణతకు కారణమని పేర్కొంది.

08/02/2016 - 01:16

సోమవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సరికొత్త రాడో వాచీలను
సంస్థ ప్రతినిధులతో కలిసి మార్కెట్‌కు పరిచయం చేస్తున్న
బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్

08/02/2016 - 01:14

చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం లెనోవా సోమవారం భారతీయ మార్కెట్‌లోకి తమ వైబ్ కె నోట్ సిరీస్‌లో 5వ ఎడిషన్‌ను విడుదల చేసింది.
వైబ్ కె5 నోట్‌గా పరిచయమైన దీని ధర 11,999 రూపాయలు

08/02/2016 - 01:11

ముంబయి, ఆగస్టు 1: బ్యాంకింగ్ రంగంలో కొత్తవారికి మరింత అవకాశాన్నిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సోమవారం ఆన్-ట్యాప్ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్సు విధానాన్ని ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 500 కోట్ల రూపాయల ప్రారంభ మూలధనంతో ఏ సంస్థ అయినా ప్రైవేట్ బ్యాంకును పెట్టవచ్చు. బ్యాంక్ నికర విలువ ఎల్లప్పుడూ 500 కోట్ల రూపాయలకు తగ్గకూడదు.

08/02/2016 - 01:10

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రాయితీ వంటగ్యాస్ ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. సిలిండర్‌కు రూపాయి 93 పైసలు చొప్పున పెరగగా, ఈ పెరుగుదలతో ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర 421.16 రూపాయల నుంచి 423.09 రూపాయలకు చేరింది. జూలై 1న కూడా రూపాయి 98 పైసలు పెరిగినది తెలిసిందే. డీజిల్, పెట్రోల్ మాదిరిగానే వంటగ్యాస్, కిరోసిన్ ధరలపైనా రాయితీని ఎత్తివేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినది తెలిసిందే.

08/02/2016 - 01:10

కొత్తగూడెం, ఆగస్టు 1: గడచిన నాలుగు మాసాల బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి సంస్థ వెనుకబడింది. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం 2 కోట్ల 28 లక్షల 5,800 టన్నులవగా, కోటీ 79 లక్షల 40,365 టన్నులు మాత్రమే సాధించి 88 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో కొత్తగూడెం, శ్రీరాంపూర్ మాత్రమే ఉత్పత్తి లక్ష్యాలను సాధించాయి.

08/02/2016 - 01:09

న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి సోమవారం కార్ల ధరలను పెంచింది. వివిధ రకాల మోడళ్ల ధరలను 20,000 రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇటీవల మార్కెట్‌కు పరిచయం చేసిన ఎస్‌యువి విటారా బ్రీజా ధర 20,000 రూపాయలు పెరిగితే, బాలెనో ధర 10,000 రూపాయలు పెరిగినట్లు చెప్పింది.

08/02/2016 - 01:09

ముంబయి, ఆగస్టు 1: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 48.74 పాయింట్లు పడిపోయి 28,003.12 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ అతి స్వల్పంగా 1.95 పాయింట్లు కోల్పోయి 8,636.55 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ లాభపడితే, చైనా సూచీ నష్టపోయింది.

08/02/2016 - 01:08

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రజలంతా కూడా ఆధార్‌తో తమతమ మొబైల్ నెంబర్లను అనుసంధానం చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) కోరింది. దీనివల్ల ఆన్‌లైన్‌లో వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా అందుకోవచ్చని తెలిపింది. కాబట్టి ఆధార్ కార్డు పొందిన సమయంలో మొబైల్ నెంబర్‌ను నమోదు చేసుకోనట్లయితే, తప్పక నమోదు చేసుకోవాలని ఓ ప్రకటనలో సోమవారం యుఐడిఎఐ సిఇఒ అజయ్ భూషణ్ పాండే సూచించారు.

Pages