S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కార్ల ధరలను పెంచిన మారుతి

న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి సోమవారం కార్ల ధరలను పెంచింది. వివిధ రకాల మోడళ్ల ధరలను 20,000 రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇటీవల మార్కెట్‌కు పరిచయం చేసిన ఎస్‌యువి విటారా బ్రీజా ధర 20,000 రూపాయలు పెరిగితే, బాలెనో ధర 10,000 రూపాయలు పెరిగినట్లు చెప్పింది. మరికొన్నింటి ధరలు 1,500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెరిగాయని, ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మార్కెట్‌లో డిమాండ్, విదేశీ మారకద్రవ్యం విలువలో హెచ్చుతగ్గులు వంటి కారణాలతో ధరలు పెంచినట్లు మారుతి తెలిపింది.