S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, జూలై 29: కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న కొద్దీ అదే స్పీడ్లో వివాదాలు కూడా తెరపైకి వస్తున్నాయి. పుష్కరాల సందర్భంగా ఒక్క విజయవాడ నగరానికే దాదాపు మూడు కోట్ల మంది పైగా యాత్రికులు తరలి వస్తారనే అంచనాతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది.
హైదరాబాద్/ముషీరాబాద్, జూలై 29: అసలే ఇష్టం లేని పెళ్లి..అదీ ఓ మైనర్ బాలికతో.. మనస్తాపానికి గురైన అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన తీవ్ర కలకలం రేకెత్తించింది.
మిర్యాలగూడ టౌన్, జూలై 29: ఆగస్టు 12నుండి జరిగే కృష్ణా పుష్కరాలకు తెలంగాణ లోని పది జిల్లాల నుండి 1100 బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.వేణు తెలిపారు.
కరీంనగర్, జూలై 29: ఎమ్సెట్ -2 లీకేజీ వ్యవహారంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులకు సంబంధమున్నట్లు తొలుత భావించినా.. తాజాగా 30మంది విద్యార్థులకు సంబంధం ఉన్నట్లుగా సిఐడి అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో ఈ నెల 9న నిర్వహించిన ఎమ్సెట్-2 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 3,076 మంది విద్యార్థులు హాజరు కాగా, 13న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
వరంగల్, జూలై 29: ఎంసెట్-2 లీక్పై దర్యాప్తు వేగం పుంజుకుంది. రెండు రోజులుగా సిఐడి పోలీసుల బృందం వరంగల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. జిల్లాలోని పరకాల, భూపాలపల్లిలో ఎంసెట్-2లో అత్యధిక ర్యాంకులు సాధించిన 11 మంది విద్యార్థులను సిఐడి పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఆ విద్యార్థులు చదివిన విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లలో వివరాలు సేకరించినట్లు సమాచారం.
నాగర్కర్నూల్, జూలై 29: ఎమ్సెట్-2 లీకేజి వ్యవహరంలో సిబిసిఐడి సేకరించిన విద్యార్థుల జాబితాలో మహబూబ్ నగర్ జిల్లా నాగర్కర్నూల్కు చెందిన ఓ విద్యార్థి పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆ విద్యార్థితోసహా తల్లిదండ్రులు మూడు రోజుల క్రితమే ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే..
ఆదిలాబాద్, జూలై 29: ఎంసెట్ లీకేజీపై ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం కూడా సిఐడి దర్యాప్తు కొనసాగింది. సిఐడి సిఐ నరేష్ కుమార్ అధ్వర్యంలో పోలీసులు కాగజ్నగర్ పట్టణానికి చెందిన సాయి నిహార్ అనే అభ్యర్థిని విచారించేందుకు గురువారం పోలీసులు వారి ఇంటికి రాగా ఇంటికి తాళం ఉండడంతో శుక్రవారం మరోమారు వారి ఇంటికి వెళ్లగా అభ్యర్థి తల్లిదండ్రులు, అభ్యర్థి సైతం సిఐడి పోలీసులకు వివరాలు వెల్లడించారు.
నల్లగొండ, జూలై 29: ఎంసెట్-2 లీకేజి వ్యవహారంలో నల్లగొండ జిల్లాకు చెందిన తిరుమలేశ్ అలియాస్ తిరుమల్రావు అనే వ్యక్తి కూడా భాగస్వామిగా ఉన్నట్లుగా సిఐడి విచారణలో నిర్ధారణ అయంది. అతన్ని అరెస్టు చేసిన సిఐడి ఇందులో ఇంకెందరి ప్రమేయముందన్న కోణంలో విచారణ జరుపుతోంది. జిల్లా పరిధిలోని కేతెపల్లి మండలం చెరుకుపల్లికి చెందిన తిరుమలేశ్ గతంలో నల్లగొండ పద్మావతి కాలనీ నివాసి.
కోస్గి, జూలై 29: అడవి పందుల బారి నుండి పంట రక్షణకై వేసిన విద్యుత్ కంచె ఆ కుటుంబంలోని ముగ్గురిని బలిగొంది. మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం తొగపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పందిరి హనుమండ్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుడుం వెంకటయ్య (65) కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తమ జొన్నపైరును అడవి పందుల బారి నుండి కాపాడుకోవడానికి విద్యుత్ కంచెను ఏర్పాటు చేశారు.
జిన్నారం, జూలై 29: మల్లన్నసాగర్ బాధితులను పరామర్శించకుండా అరెస్టు చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం.. పంపితే మల్లన్నసాగర్కు పంపండి లేదంటే జైలుకు పంపండి అని భీష్మించుకొని కూర్చున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు.