S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 08:04

కింగ్‌స్టన్, జూలై 29: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసిన భారత క్రికెట్ జట్టులో శనివారం నుంచి మొదలయ్యే రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అన్ని విభాగాల్లోనూ భారత జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది. విండీస్ అందుకు భిన్నంగా దారుణంగా విఫలమవుతున్నది. అటు బౌలింగ్‌లోగానీ, ఇటు బ్యాటింగ్‌లోగానీ ఆ జట్టు రాణించలేకపోతున్నది.

07/30/2016 - 07:57

న్యూఢిల్లీ, జూలై 29: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మదింపు సంవత్సరం 2016-17కుగాను ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు వచ్చే నెల 5 వరకు సమయం ఇచ్చింది. నిజానికి ఈ నెల 31 వరకే ఆదాయ పన్ను రిటర్స్ దాఖలుకు తుది గడువు. అయితే దీన్ని ఆగస్టు 5 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

07/30/2016 - 07:56

న్యూఢిల్లీ, జూలై 29: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త గవర్నర్ రేసులో తన అభ్యర్థిత్వంపై ఊహాగానాలను కొనసాగిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య.. దీనిపై తాను స్పందించలేనన్నారు. ఇదంతా మీడియా ఊహాగానాలేనన్న ఆమె తాను ఆర్‌బిఐ చీఫ్ రేసులో లేనని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారు. శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో పాల్గొన్న భట్టాచార్య..

07/30/2016 - 07:55

న్యూఢిల్లీ, జూలై 29: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 22.1 శాతం పడిపోయి 2,516 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో 3,232 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది.

07/30/2016 - 07:55

న్యూయార్క్, జూలై 29: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సిఇఒ జెఫ్ బెజోస్.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో నిలిచాడు. వారెన్ బఫెట్‌ను వెనక్కినెట్టి 65.3 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలో దూకుడును ప్రదర్శించాడు. బఫెట్ సంపద 64.9 బిలియన్ డాలర్లుండగా, ఆయన నాలుగో స్థానానికి పడిపోయాడు.

07/30/2016 - 07:54

న్యూఢిల్లీ, జూలై 29: దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దాదాపు 700 మంది ఉద్యోగులను తీసేస్తోంది. అమెజాన్, స్నాప్‌డీల్ తదితర ఇతర ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ నేపథ్యంలో సంస్థాగత వ్యయాన్ని తగ్గించుకునే దిశగా ఫ్లిప్‌కార్ట్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 700 మంది సిబ్బందికి ఉద్వాసన పలకనుంది. సంస్థలో 22,000 మందికిపైగా పనిచేస్తున్నారు.

07/30/2016 - 07:54

న్యూఢిల్లీ, జూలై 29: ప్రభుత్వరంగ బ్యాంకుల సమ్మెతో శుక్రవారం వేలాది కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐలోకి దాని అనుబంధ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఒక్కరోజు బంద్‌ను నిర్వహించారు. దీని ఫలితంగా ఈ ఒక్కరోజే 12,000 కోట్ల రూపాయల నుంచి 15,000 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు ప్రభావితమైనట్లు పారిశ్రామిక సంఘం అసోచామ్ అంచనా వేసింది.

07/30/2016 - 07:53

న్యూఢిల్లీ, జూలై 29: తెలంగాణ రాష్ట్రంలో చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేంద్రానికి రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ వాసుల సమస్యలను కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఆయన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, పౌర విమానయాన శాఖ మంత్రి ఆశోక్ గజపతి రాజులతో సమావేశం అయ్యారు.

07/30/2016 - 07:43

గుర్గావ్, జూలై 29: గురువారం సాయంత్రం ఢిల్లీతో పాటుగా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గుర్గావ్ నగరం పూర్తిగా స్తంభించి పోయింది. డ్రైనేజిలు పొంగి, రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచి పోవడంతో ఢిల్లీనుంచి గుర్గావ్ వెళ్లే 8వ నంబరు జాతీయ రహదారిపై వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకు పోయాయి. వాహనదారులు తమ వాసనాలను ఎక్కడివక్కడే వదిలేసి నడుంలోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్తుండడంతో పరిస్థితి దారుణంగా మారింది.

07/30/2016 - 07:42

ఫిలడెల్ఫియా, జూలై 29: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ మరోసారి తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. మత దురభిమానం, శబ్దాడంబరం గల ట్రంప్‌కు అధ్యక్ష పదవి వంటి ఉన్నతమైన బాధ్యతలను అప్పగించడం అమెరికాకు క్షేమం కాదని ఆమె ఓటర్లను హెచ్చరించారు.

Pages