S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 07:01

మహబూబ్‌నగర్, జూలై 29: కృష్ణా పుష్కరాల సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో అధికార యంత్రాంగంతో పాటు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల హడావుడి బాగానే ఉంది. కానీ జిల్లాలో 32 ప్రధాన పుష్కర ఘాట్‌లకు గాను ఇప్పటి వరకు కేవలం 16 ఘాట్ల నిర్మాణం పనులు మాత్రమే జరిగాయి. పనులు జరిగిన వాటిని కలరింగ్ తదితర పరికరాలు అమర్చలేదు. కొన్ని పుష్కర ఘాట్ల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కనబడుతున్నాయి.

07/30/2016 - 06:55

మంత్రాలయం, జూలై 29: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్రతీర్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును శుక్రరవారం రాజధానిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆగస్టు 17 నుంచి జరుగనున్న 345వ శ్రీ రాఘవేంద్రస్వామి సప్తఆరాధనోత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.

07/30/2016 - 06:54

విశాఖపట్నం, జూలై 29: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో చెదురు, మదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో పశ్చిమ దిశగాను, ఉత్తర కోస్తాలో నైరుతి దిశగాను గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

07/30/2016 - 06:51

చిత్తూరు, జూలై 29 : చిత్తూరు ఎంపి డాక్టర్ ఎన్ శివప్రసాద్ మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం వేషధారణలో అలరించారు. చిత్తూరు మార్కెట్‌యార్డులో 67వ వనమహోత్సవం జరిగింది.అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించిన వనమహోత్సవం కార్యక్రమానికి ఎంపి శివప్రసాద్ కలాం వేషధారణలో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ముఖ్యంగా విద్యార్థుల వద్ద వెళ్లి కాసేపు ముచ్చటించారు.

07/30/2016 - 06:51

చింతూరు, జూలై 29: మావోయిస్టులు దండ కారణ్య సరిహద్దు ప్రాంతాల్లో పట్టుకోసం పోరాటం సాగిస్తున్నారు. పోలీసులు మావోయిస్టుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్ని ఎదురుదాడికి దిగుతుండటంతో ఇప్పుడు రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

07/30/2016 - 06:50

చిత్తూరు/తిరుపతి/కడప, జూలై 29: రుతుపవనాల ప్రభావంతో సీమలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయ. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహించగా సోమల, చౌడేపల్లి మండలాల్లో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. అనేక ప్రాంతాల్లో జోరుగా ఈదురు గాలులు ఉరుములు మెరుపులతోకూడిన వర్షం కురవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

07/30/2016 - 06:50

విశాఖపట్నం, జూలై 29: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ) ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంథ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తరగతి గదులను తీర్చిదిద్దగా, ఇతర ఏర్పాట్లలో ఎయు, హెచ్‌పిసిఎల్, ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థులు బిజీగా ఉన్నారు.

07/30/2016 - 06:48

రాజమహేంద్రవరం, జూలై 29: నదుల అనుసంధానం ప్రయోజనం ఈ ఏడాది కృష్ణా పుష్కరాలకు పూర్తిస్థాయిలో కనిపిస్తోంది. గత ఏడాది గోదావరి పుష్కరాల సమయంలో స్నానాలకు అనువుగా నీటి మట్టాన్ని కొనసాగించడానికి అధికార్లు విపరీతమైన కసరత్తు చేయాల్సివచ్చింది. సీలేరు నుండి సైతం జలాలను విడుదలచేయించి, గోదావరి ఘాట్లలో స్నానాలకు అనువుగా నీటిమట్టాన్ని నిర్వహించారు.

07/30/2016 - 05:28

హైదరాబాద్, జూలై 29: ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. శుక్రవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలతో అనేక చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. నగరంలోని సచివాలయం, జెఎన్‌టియు క్యాంపస్, మంత్రుల నివాస సముదాయం, ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద వేర్వేరుగా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు.

07/30/2016 - 05:23

హైదరాబాద్, జూలై 29: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజిపై సిబిఐ విచారణ జరిపించాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థపై ప్రభుత్వానికి కంట్రోల్ లేకుండా పోయిందని విమర్శించారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం, కార్పొరేట్ విద్యా రంగంపై కంట్రోల్ లేకపోవడం, యూనివర్సిటీలకు విసిలు లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని అన్నారు.

Pages