-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయిలో
*
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: 2,903.00 రూపాయలు
8 గ్రాములు: 23,224.00 రూపాయలు
10 గ్రాములు: 29,030.00 రూపాయలు
100 గ్రాములు: 2,90,300.00 రూపాయలు
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: 3,178.000 రూపాయలు
8 గ్రాములు: 25,424.000 రూపాయలు
10 గ్రాములు: 31,780.00 రూపాయలు
100 గ్రాములు: 3,17,800.00 రూపాయలు
వెండి
అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటుకానున్న పరిశ్రమలకు సకల సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా సుప్రసిద్ధ సంస్థ షియోమీ సౌజన్యంతో తిరుపతిలో మొబైల్ విడిభాగాల ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ హోలీటెక్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
హైదరాబాద్, ఆగస్టు 6: రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఓరియంట్ సిమెంట్ కంపెనీ ముందుకు వచ్చింది. కంపెనీ విస్తరణ ద్వారా 4 వేల ఉద్యోగాలు, పరోక్షంగా మరో 4 వేల ఉద్యోగాలు లభిస్తాయని గ్రూపు చైర్మన్ సికె బిర్లా ప్రకటించారు.
మాల్యా, నీరవ్ మోదీలాంటి వారివల్ల కలిగిన నష్టాన్ని
ఇలా పూడ్చుకుంటున్నారేమో!
న్యూఢిల్లీ, ఆగస్టు 6: పెప్సీ కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి ఇంద్రా నూయి వైదొలగనున్నారు. సుమారు 12 సంవత్సరాలు కంపెనీకి విశిష్ట సేవలు అందించిన ఆమె ఈ ఏడాది అక్టోబర్ 3న తన బాధ్యతలను రామన్ లగార్తాకు అప్పగిస్తారు. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్గా ఉన్న లగార్తా కంపెనీలో 22 సంవత్సరాలు వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఐరోపాతోపాటు ఆఫ్రికా సహారా డివిజన్లో ఆయన కంపెనీ ఈసీఓగా వ్యవహరించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 6: కంప్యూటర్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) క్రమంగా పెరుగుతున్నాయి. 2005-06 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఎఫ్డీఐల ఒరవడి ఒకానొక దశలో క్షీణించినప్పటికీ, ఆతర్వాత పుంజుకొని, గతంలో ఎన్నడూ లేని రీతిలో గత ఆర్థిక సంవత్సరం 6,153 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ముంబయి, ఆగస్టు 6: దేశీయ మార్కెట్లు లాభాల పంట పండిస్తున్నాయి. గత వారం రికార్డు స్థాయిలో పెరిగిన ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ లావాదేవీల జోరు ఈ వారం మొదటి రోజున కూడా కొనసాగింది. ఇప్పటికే సెనె్సక్స్ రికార్డు స్థాయికి చేరుకోగా, సోమవారం స్వల్పంగా పెరిగి, 37,805.25 పాయింట్లకు చేరుకుంది. ఇది సరికొత్త రికార్డుగా నమోదైంది. మొత్తం మీద సెనె్సక్స్, నిఫ్టీ స్వల్పంగా పెరగ్గా, బ్యాంకింగ్ రంగం లాభపడింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఫార్మాస్యూటికల్ రంగంలో అగ్రగామిగా ఉన్న అలంబిక్ సంస్థ తన వ్యాపార శ్రేణిని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. అమెరికాలో కంటికి సంబంధించిన మందు సొల్యూషన్ను మార్కెట్ చేసేందుకు ఈ సంస్థ చేసుకున్న విజ్ఞప్తికి సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) తాత్కాలికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 6: ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. 0.70 శాతం పెరగడంతో, బ్యారెల్ ధర 4,719 రూపాయలకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ గమన విధానాలను అధ్యయనం చేసిన పెట్టుబడిదారులు క్రూడ్ ఆయిల్పై దృష్టి సారించారు. ఈ రంగంలో వ్యాపార లావాదేవీలు 299 లాట్స్కు చేరుకోగా, గత ఏడాది సెప్టెంబర్లో 4,657 రూపాయలుగా ఉన్న బ్యారెల్ ధర 0.70 శాతం పెరిగింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 6: చమురు మరియు సహజవాయువు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లాభాలు పెరిగాయి. ప్రీ టాక్స్ త్రైమాసిక లాభం పెరగడంతో, అప్పులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ త్రైమాసికంలో ఓఎన్జీసీ లాభం 47.2 శాతం పెరిగింది. దీనితో ఆపరేషనల్ ప్రాఫిట్ 14,240 కోట్ల రూపాయలుగా నమోదైంది.