S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయన్ ఫీచర్
‘జయజయ జయభారత జనయిత్రీ దివ్యథాత్రి’ అనే సంగీతం భూనభోంతరాళాలు మార్మోగుతున్నవేళ. ఉదయ సంధ్యారాణి మరో స్వేఛ్చా స్వాతంత్య్ర హేల. ఈ పవిత్ర సమయంలో జాతి విముక్తికై రక్తతర్పణం చేసి దివికేగిన దేశభక్తులను ఒక్కసారి స్మరించుకుందాం. వారి అడుగుజాడలను అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.
అనగనగా ఒక నరుూమ్. అతనొక గుం డెలు తీసిన బంటు. సాధారణ నక్సలైటు నుంచి దావూద్ ఇబ్రహీం వారసుడు కావాలన్న కోరిక డాన్గా మార్చింది. ఆ క్రమంలో ఖాకీలతో చేసిన సహవాసం అతగాడిని వందలకోట్లకు పడగలెత్తేలా చేసింది. ఆ పుణ్య కార్యక్రమంలో పోలీసు అధికారులు, రాజకీయ నాయకులూ పాలుపంచుకుని యధాశక్తిన సంపాదించుకున్నారు. చివరాఖరకు పాపం పండిన నరుూమ్ అదే పోలీసు తూటాలకు బలయ్యాడు.
దేశ ప్రజల దృష్టిని మరల్చడానికై యుద్ధం ఎంతగా తోడ్పడుతుందో, ప్రపంచ స్థాయి పండగలాంటి ఆట లూ అంతే పనిచేస్తాయి. యుద్ధం పాలకుల పట్ల సానుభూతిని, దేశం పట్ల దేశభక్తిని కలిగిస్తే, ఆటలు దేశకీర్తి ప్రతిష్ఠల్ని ఇనుమడింపజేస్తాయి. యుద్ధంలో గెలిచినా, ఓడి నా మిగిలేది బాధ, ప్రాణ, ఆస్తి, ఆర్థిక నష్టం కాగా, ఆటలు గెలిచినా, ఓడినా, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి.
స్వాతంత్య్ర విజయాన్ని ఆర్థిక ప్రగతితో ముడిపెట్టి నిర్ధారణలు చేయడం అంతర్జాతీయ రీతి. ఆర్థిక ప్రగతి మాత్రమే స్వాతంత్య్ర విజయానికి కొలమానం కాదు, కారాదు. అయినప్పటికీ ఏడు దశాబ్దులలో స్వతంత్ర భారత్ గణనీయమైన భౌతిక ప్రగతిని సాధించడం నిరాకరించలేని నిజం.
‘‘మీరు చెప్పే ఒక్క అక్షరంతో కూడా నేను ఏకీభవించను కానీ అలా చెప్పే అధికారం మీకు ఉందని ఏకీభవిస్తాను’’ అని అన్నాడొక తత్వవేత్త. ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలు, రాజకీయ పార్టీల వ్యవహారశైలిని పరిశీలిస్తే సాత్విక రాజకీయాలకు తెరపడిందా? అన్న అనుమానం కలుగుతోంది.
మద్రాసు హైకోర్టులో సోమవారం వెలువడిన తీర్పుతో-ప్రాచీన విశిష్ట భాషలు (క్లాసికల్ లాంగ్వేజెస్)గా కేంద్ర ప్రభుత్వం పలువిడతలుగా గుర్తింపు ఇచ్చిన తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడం, మలయాళం, ఒడిసా భాషలన్నింటి పరువు నిలబడింది.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కన్నా, ఇస్తామని నమ్మించి ఇవ్వడం లేదన్నది ప్రజల మనస్సులను ఎక్కువ గాయపరుస్తున్నది. సాధారణ జీవితంలోనైనా ఇంతే. ఇతరులు మనకు నష్టం కలిగించడం వల్ల కలిగే బాధకన్నా, నమ్మించి ద్రోహం చేయడం ఎ క్కువ బాధపెడుతుంది. అది మోసం వం టిది. నమ్మి మోసపోవడాన్ని మనిషి త్వరగా మరిచిపోలేడు.
మన రాజకీయ పార్టీల నటన చూసి ఆస్కా ర్ అవార్డు కూడా చిన్నబోయి చిన్నదవుతుందేమో?! ప్రత్యేక హోదా బిల్లుపై నవరసాలు పండించిన పార్టీల చిత్తశుద్ధి ఏమిటన్నది జీఎస్టి బిల్లు సందర్భంలో తేలిపోయింది. ప్రత్యేక హోదా కోసం ఎంతవరకయినా తెగిస్తామని తెదేపా కనె్నర్ర చేసింది. అవసరమైతే కేంద్రం నుంచి బయటకు రావడానికీ సిద్ధమని ప్రకటించింది. అటు తెలుగు తమ్ముళ్లూ కమలంపై కనె్నర్ర చేశారు.
కానున్న పనిని గంధర్వులు చేశారన్న సామెతలాబాబు కార్యాన్ని కాంగ్రె స్ మీదేసుకొని తన నిజాయతీని నిరూపించుకునే నటనను ప్రారంభించింది. హోదా బిల్లు విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కెవిపి రామచంద్రరావు వైఎస్ఆర్ హయాంలో దేశ రాజకీయాల్లో బాగా తలపండిన వ్యక్తే. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్తో కలిసి అడుగులు వేస్తారని భావిస్తే, కాంగ్రెస్లోనే కొనసాగడం కించిత్ ఆశ్చర్యమే.