-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
కొలంబో, జూన్ 18: భారత్ ఆర్థిక వృద్ధి పొరుగుదేశాలకు దోహదకారి కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో భారత్ సాయంతో పునర్నిర్మించిన స్టేడియంను శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో కలిసి మోదీ ప్రారంభించారు. 1996నుంచి నిరుపయోగంగా ఉన్న ఈ స్టేడియంను దాదాపు 7 కోట్ల రూపాయల భారత్ సాయంతో పునర్నిర్మించారు.
థానె, జూన్ 18: సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల విలువ గల అంతర్జాతీయ మాదకద్రవ్యాల కుంభకోణంలో శనివారం మాజీ నటి మమతా కులకర్ణి పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్ బారన్ వికీ గోస్వామికి చెందిన ఈ మాదకద్రవ్యాల కుంభకోణంలో మమతా కులకర్ణి ప్రధాన నిందితురాలని థానె పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.
బీజింగ్: చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ ప్రాంతంలో వరదల కారణంగా ఆరుగురు మృతిచెందగా ఇద్దరు గల్లంతయ్యారు. వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 39,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 5,000 మంది బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
వాషింగ్టన్, జూన్ 17: దేశంలో అత్యంత కఠినమైన రీతిలో తుపాకుల లైసెన్స్లకు సంబంధించిన చట్టాలను అమల చేయకపోతే ఓర్లాండో తరహా భయానక మారణకాండలు పునరావృతం అవుతూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ తరహాలో ఉగ్రవాద చర్యలకు విఘాతక కృత్యాలకు పాల్పడే ప్రతి ఒక్కరినీ గుర్తించడం, నియంత్రించడం, వారి ఆలోచనలను ముందుగానే పసిగట్టడం అనేది ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు.
బీజింగ్, జూన్ 16: అణు ఇంధన సరఫరా దేశాల గ్రూప్ (ఎన్ఎస్జి)లో సభ్యత్వం సాధించే దిశగా భారత్ దూసుకుపోతోందని చైనా అధికార మీడియా అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎన్ఎస్జిలోకి భారత్ చేర్చుకోవటం వల్ల దక్షిణాసియాలో వ్యూహాత్మక సంతులనం దెబ్బతినే ప్రమాదం ఉందని అక్కడి మీడియా పేర్కొంది.
దిల్లీ: వందేళ్ల చరిత్ర కలిగిన ఐసీసీకి ఛైర్మన్గా భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ ఎన్నికయ్యారు. ఈ పదవిలో కొనసాగుతున్న ఎస్అండ్పీ గ్లోబల్ ఛైర్మన్ టెర్రీ మెక్గ్రామ్ నుంచి మిట్టల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మిట్టల్ ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ టెలికమ్యూనికేషన్ స్టీరింగ్ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
వాషింగ్టన్, జూన్ 15: ఈ సృష్టిలో జీవావిర్భావం ఎలా జరిగింది? ఒక్క భూమీదే సమస్త జీవరాశి ఆవిర్భవించటానికి మూలం ఏమిటి అన్నది శతాబ్దాలుగా మానవ మేధస్సును దొలిచేస్తున్న ప్రశ్న. ఈ దిశగా అనేక పరిశోధనలు జరిగినప్పటికీ, తాజాగా అంతరిక్షంలో అదీ గ్రహాల మధ్య భాగంలో తొలిసారిగా కేంద్రీయ కణాన్ని పోలిన ఆధారాలను కనుగొన్నారు. ఈ సంక్లిష్ట సేంద్రీయ కణాలు జీవ ఉద్భవానికి అత్యంత కీలకం.
వాషింగ్టన్, జూన్ 15: భారత దేశాన్ని అంతర్జాతీయ వ్యూహాత్మ, రక్షణ భాగస్వామిగా గుర్తించడానికి ఒబామా ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి అమెరికా సెనేట్లో చుక్కెదురైంది. దీనికోసం అవసరమైన అమెరికా జాతీయ రక్షణ అధీకృత చట్టానికి ప్రతిపాదించిన కీలక సవరణ అమెరికా సెనేట్లో ఆమోదం పొందలేకపోయింది.
వాషింగ్టన్, జూన్ 15: అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ల నామినీగా హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వం ఖరారైంది. అమెరికా రాజధాని వాషింగ్టన్లో బుధవారం జరిగిన తుది ప్రైమరీలో హిల్లరీ తన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్పై విజయం సాధించారు. దీంతో అధ్యక్ష పదవికి నవంబర్లో జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై పోటీకి హిల్లరీ సమాయత్తమవుతున్నారు.
షిల్లాంగ్, జూన్ 15: మేఘాలయలోని సోనాపూర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈస్ట్ నైనిటాల్ హిల్స్ జిల్లాలో ఒక బస్సు లోయలోపడి 30 మంది దుర్మరణం చెందారు. 11 మంది గాయపడ్డారు. మంగళవారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని మేఘాలయ డిజిపి రాజీవ్ మెహతా చెప్పారు. బస్సు అస్సాం రాజధాని గౌహతి నుంచి వస్తుండగా సోనాపూర్ వద్ద లోయలో పడిపోయిందన్నారు.