S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

10/20/2019 - 22:53

నీవు త్రిపురాలకూ వెళ్ళి అక్కడి ప్రజలలో భక్తిని తగ్గించి శృంగారానికి బానిసలయేట్లు చేయి. వేదాలలో లేని ఐహిక విషయాలకు వారు ప్రాముఖ్యత నిచ్చే విధంగా ఆకర్షణీయంగా భాషణాలు చేయి. ఆస్తికులైన ఆ ప్రజలూ, రాజులూ, నాస్తికులూ ధర్మ నిరసనులూ అయేట్లు చేయటమే లక్ష్యంగా పెట్టుకో. ఆ స్థితిలో వారిని నా సహకారంతో శంకరుడు సంహరిస్తాడు.’’ అని అతనికి విష్ణువు బోధించి పంపాడు.

10/15/2019 - 18:32

భిల్ల దంపతులు
పూర్వం కైలాస పర్వతానికి దగ్గరలోని ఓ అరణ్యంలో ఆహుకుడు, ఆహుకి అనే భిల్ల దంపతులు నివసించేవారు. భర్త తెచ్చిన కందమూలాలూ, పుట్టె తేనె, వెదురు బియ్యమ్ఱుతో శివ పూజలు చేస్తూ మాంసాదులు వండి అతిథి సత్కారాలు చేస్తూండే భిల్లాంగననూ, ఏ పని చేస్తున్నా శివుడినే ధ్యానిస్తూ ఉండే భిల్లుడినీ పార్వతీ పరమేశ్వరులు పరీక్షించదలిచారు.

10/14/2019 - 19:35

మునులారా! తెలియకుండా చేసినా శివరాత్రి వ్రతం ఎంతటి ఫలితాన్నిచ్చిందో చూసారా!’’ అన్నారు సూత మహర్షి. గురుద్రుహుని గాద కూడా శివరాత్రి వ్రత ఫలాన్ని తెలుపుతుంది.
గురుద్రుహుడు / గుహుడి కథ(కోటి రుద్ర సంహిత)

10/13/2019 - 22:11

నీల ‘కం’ధరుడు
దేవ దానవులు అమృతం కోసం క్షీర సముద్రాన్ని చిలుకుతూండగా అంతకంటే ముందు ‘హాలాహలం’ అనబడే విషము ఉద్భవించింది. భుగభుగ పొగలతో, భయంకర విస్ఫోటనలతో ఆ దావానలం నుండి ఆవిర్భవించిన జ్వాలలకి లోకాలు అట్టుడికి పోయి, ఊపిరాడక తల్లడిల్లాయి.
ఆ సమయాన దేవతలు బ్రహ్మతో సహా కైలాసానికి పరువెత్తి వెళ్ళి ఈశ్వరుడిని ప్రార్థించారు.

10/10/2019 - 19:30

కాశీ యాత్ర చేసి అక్కడి విశే్వశ్వరునితో పాటూ అన్నపూర్ణా, విశాలాక్షీ, దండపాణి, డుంటి గణపతి, కాలభైరవ, హనుమద్ ప్రాంగణాలూ దర్శించాలి. మాంధాత అనే చక్రవర్తి ఒకప్పుడు కేదారేశ్వరం నుండి తరలించి తెచ్చిన పదునాలుగు కళలతో అలరారే కేదార లింగమునూ ఇతర ప్రముఖ ఋషివర్యులెందరో ప్రతిష్ఠించిన ద్వాదశ జ్యోతిర్లింగాలయాలనూ సందర్శించిన వారికి అడుగడుగుకీ అశ్వమేద యాగ ఫలం సిద్ధిస్తుంది.

10/09/2019 - 18:31

నీవు కాశీలో మరణించే భక్తుల కుడి చెవిలో అవసాన దశలో దానిని ఊదుతూ వారికి ఉత్తమ గతులు సిద్ధింపజేయి’’ అని అతడిని దీవించాడు. బ్రహ్మ హత్యా పాతకాన్ని ఉద్దేశించి,
‘‘ఓ పాతకమా! కాశీకి చేరిన వెంటనే కాలభైరవుడిని వదలిన సూచనగా భస్మాన్ని రాల్చి నీవు వెనువెంటనే ఎక్కడ దుర్మార్గులూ, నాస్తికులూ, జూదరులూ, త్రాగుబోతులూ, కసాయి వాళ్ళూ చరిస్తూ ఉంటారో ఆ స్థానాలకి వెళ్ళి వసించు’’ అని ఆజ్ఞాపించాడు.

10/07/2019 - 19:05

గంగమ్మ అందులోకి ప్రవేశించింది.
అనసూయ సంతోషించి, ‘‘అమ్మా!నేను మళ్ళీ వచ్చేవరకూ నీవిక్కడనే ఉండు తల్లీ!’’ అని ప్రార్థించగా, ఆమె చేసిన తపస్సులోని ఒక మాస ఫలాన్ని తనకు ధారపోస్తే అలాగే ఉంటానన్నది గంగమ్మ తల్లి.
అనసూయ అలాగే చేసి నీటితో కమండలాన్ని నింపుకుని వచ్చి భర్తకు సమర్పించింది. అమృత ప్రాయంగా ఉన్న ఆ జలాన్ని గ్రోలిన అత్రి మహర్షి,

10/03/2019 - 18:53

మార్కండేయుడు మహాభక్తుడు. మరుద్వతీ, మృకండ దంపతులకు లేక లేక శివ వర ప్రసాదిగా జన్మించిన ఇతడు తాను అల్పాయుష్కుడనని తెలుసుకుని, నారద మహర్షి సలహా మేరకు గోదావరీ తీరానున్న రాజరాజేశ్వరీ సోమసుందరులను ఆరాధించి యమ పాశాన్నుంచి తప్పించుకోగలిగాడు. పరమ భక్తితో శివుడిని ఆరాధించి ఆయనచే ఏడు కల్పాల ఆయువును వర ప్రసాదంగా పొందినవాడాయన.

09/30/2019 - 18:43

బ్రహ్మ విష్ణువులిరువురికీ వారి శిరస్సులపై తన కరాలనుంచి మంత్రదీక్షను ప్రసాదించాడు.
బ్రహ్మ విష్ణువులు ఆ మహాదేవుడిని మనసారా స్తుతించారు.

09/29/2019 - 22:23

విష్ణుమూర్తి సత్య సంధతకు సంతోషించి రుద్రునితో సమాన స్థాయిని ప్రసాదించాడు ఈశ్వరుడు.

Pages