S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
రోజులు మారినై.. చమురు కుబేరులైన సౌదీ రాకుమారులకు గడ్డుకాలం దాపురించింది. రాజుగారు సల్మా సల్మాన్ బిన్ అబ్దుల్ అల్ అల్సాద్గారు- రాకుమారులకు కూడా- ఉచితంగా కరెంట్ లేదు.. నీళ్ళు లేవూ- పెట్రోలు తాగండి కానీ వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు-కొత్తగా విధించిన వ్యాట్ సుంకాలు చచ్చినట్లు కట్టండి’’ అన్నాడు.
కాలేజీ లెక్చరర్గా ‘వెళ్లొర్’ (తమిళనాడు)లో పనిచేస్తున్న శ్రీమతి ఇందిరా గాంధీ (45) తన మొగుడు పేరు పురుషోత్తమన్- తన సొమ్ము కోటిన్నర రూపాయలు పట్టుకొని ఉడాయించాడని ఫిర్యాదు చేసింది. అంతలో మరో కుముదవతి తన భర్త (57) ఒక సివిల్ కేసులో తాను గెలిస్తే 17 కోట్ల రూపాయలు వస్తాయని చెబితే- పొలాలన్నీ అమ్మేసి మూడు కోట్ల రూపాయలు ఇచ్చి పంపానని మొత్తుకుంటున్నది.
సరదా సరదా సిగరెట్టు అంటూ ఈ వ్యసనానికి బానిసలవుతున్నవారు రోజురోజుకి అధికమవుతోంది. క్యాన్సర్లాంటి ప్రాణాంతక వ్యాధులు కొనితెచ్చుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో రోజుకు 109 సిగరెట్లు కాల్చటం అధికంగా గుర్తించారు. అతి తక్కువుగా 82 సిగరెట్లు కాలుస్తున్నట్లు గుర్తించారు. గ్రీస్లో ప్రతి వెయ్యిమందికి 312 మంది సిగరెట్లు తాగుతున్నట్లు గుర్తించారు.
రచనలను ఈ మెయిల్లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్లో
bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03
ఎన్నాళ్లనుంచో చూస్తూనే ఉన్నాం కదా..
మెడలో వేలాడే దునిమిన దుర్జనుల పుర్రెల పూమాలని
చేతిలో హెచ్చరికల ప్రతీకలా పట్టుకున్న ఒక త్రిశూలాన్ని
ఎన్నాళ్లనుంచో చూస్తూనే ఉన్నాం కదా..
ధైర్యం ఎగరేసిన పతాకలా పైకొచ్చిన ఎర్రెర్రని నాలుకని
కోపం రగిలించిన దీపాల్లా మండే చూపుల నేత్రాలని
ఎన్నాళ్లనుంచో చూస్తూనే ఉన్నాం కదా
అది 2002 సంవత్సరం. డిసెంబర్ 31వ తేదీ రాత్రి. నూతన సంవత్సర వేడుకలను యువతీ యువకులు హోటళ్లలోనూ, పబ్లలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. బెంగళూరులోని తాజ్ హోటల్లో పనిచేసే నారాయణా కృష్ణన్ హోటల్లో వండాల్సిన వంటలన్నీ వండేసి తన ఇంటికి బయలుదేరాడు. నారాయణా కృష్ణన్ వండిన వంటకం రుచి అమోఘం అని ప్రసిద్ధి. అతని వంటల రుచి చూసిన స్విట్జార్లాండ్లోని ఓ హోటల్ వారు అతనికి లక్షల్లో జీతం ఇస్తాం రమ్మన్నారు.
బెడ్ షీట్స్ ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఎలర్జీ సమస్యలకు దూరంగా ఉంటాం. రోజుల తరబడి ఉంచటం వల్ల ఆస్తమాకు మీరు దగ్గరవుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెడ్ మీద కూర్చొని చాలామంది తినటం, తాగటం చేస్తుంటారు. దీంతో దుమ్మూ ధూళి, మరికొన్ని రకాల బాక్టీరియా, చర్మకణాలు బెడ్ షీట్స్ను ఎల్లప్పుడూ అంటి పెట్టుకుని ఉంటాయి.
కొత్త సంవత్సరం 2018లో అర్థరాత్రి చెవులు చిల్లులు పడే హ్యాపీ న్యూఇయర్ కేక్లమధ్య బంగలూరులోని రాజాజీనగర్లోని డాక్టర్ నాగరాజా మెమోరియల్ ఆసుపత్రిలో పుష్పా అనే మధ్యతరగతి ఇల్లాలు ఆడపిల్లకి జన్మనిచ్చింది. బాలిక క్యార్ క్యార్లే హ్యాపీ న్యూఇయర్ అనుకున్నారు కాని, తండ్రి ఎం.గోపి మొహం అంత వికసించలేదు కాని, మర్నాడు పొద్దునే్న సిటీ మేయర్ గారొచ్చారు పాపని చూద్దామని. తల్లి సంభ్రమాశ్చర్యంగా పాపని అందించింది.
జార్ఖండ్ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి గవర్నమెంటు స్కూల్స్లో ఏడాదికోరోజు తల్లినీ తండ్రినీ పూజ చేసే రోజుగా కేటాయిస్తూ విద్యా శాఖమాత్యురాలు శ్రీమతి నీరాయాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో నలభై వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. దీనిని ‘మాత్రి పిత్రి దివస్’ అంటారు. మొత్తం యాభై లక్షలమంది విద్యార్థులు ఇక ఏటా పేరెంట్స్ డే చేసుకుంటారు.
అధిక రక్తపోటు, సిగరెట్లు తాగ టం, పోషకాహార లోపం వల్ల ప్రపం చంలో అత్యధిక మరణాలు సంభ విస్తున్నాయ. వాయు కాలుష్యం వల్ల ఏటా భారత్లో 14 లక్ష ల మంది మృత్యువాతపడుతున్నారు. వాతావరణ కాలుష్యం మనిషి జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాదాపు 188 దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ కాలుష్యం మనిషిలో అధిక రక్తపోటుకు కారణమవుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.