-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 20: స్నాచింగ్, మోటారు సైకిళ్ల చోరీ కేసుల్లో నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 16కేసుల్లో నిందితుల నుంచి సుమారు రూ.10లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ బీ రాజకుమారి తెలిపారు. కమాండ్ కంట్రోల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మర్పల్లి, ఫిబ్రవరి 20: చెరుకు యంత్రం డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మర్పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సింగంశెట్టి ప్రభాకర్ గుప్తాకు చెందిన వ్యవసాయ పొలం వద్ద కూలి పనికి సింగూరి మల్లయ్య వెళ్లాడు. చెరుకు కోత జరుగుతుండగా చెరుకు నింపుకోడానికి డ్రైవర్ యంత్రాన్ని నిర్లక్ష్యంగా వెనుకకు నడపగా అక్కడే వున్న మల్లయ్యను ఢీకొంది.
దిల్సుఖ్ నగర్, ఫిబ్రవరి 20: కోపంతో భార్యను చంపి, ఓ వ్యక్తి తాను బలవన్మరణానికి యత్నించిన సంఘటన బుధవారం సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి ప్రగతినగర్ కాలనీలో గోపాలచారి (30) భార్య కవిత (25)తో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరగటంతో కోపోద్రిక్తుడైన గోపాలచారి.. కవితను గొంతు నులిమి చంపాడు.
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 20: నార్సింగి మండలంలోని పోలీసు అకాడమీ వద్ద బుధవారం తెల్లావారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయ. కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాకు చెందిన బీమప్ప, రాములు.. ఆరెమైసమ్మ ఆలయం ప్రాంతంలో హమాలీ కూలీలుగా పనిచేస్తున్నారు.
సైదాబాద్, ఫిబ్రవరి 20: పట్టపగలు సైదాబాద్లో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఇంటి వెనుక ద్వారం నుంచి లోపలికి చొరబడి వృద్ధ దంపతులపై విచక్షణ రహితంగా దాడి చేసారు. వృద్ధుల కేకలతో దోపిడీకి విఫలయత్నం చేసి పరారైనారు. స్థానికుల సహకారంతో బాధితులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
వనస్థలిపురం, ఫిబ్రవరి 20: నిరుద్యోగులను నమ్మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట ముఠా సభ్యులను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద రూ.10 లక్షల నగదు, 35 లక్షల విలువ గల నకిలీ ఒప్పంద పత్రాలు, ప్రింటర్లు, కారు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉప్పల్, ఫిబ్రవరి 20: అమెరికా ఫ్లోరిడాలోని సూపర్ మార్కెట్లో మంగళవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో ఉప్పల్ నివాసి గోవర్దన్ రెడ్డి (48) మరణించారు. ఉద్యోగరీత్య ఏడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. సూపర్మార్కెట్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. దుండగులు చొరబడి కాల్పులు జరపడంతో గోవర్దన్ అక్కడిక్కడే మృతిచెందారు. అతని భార్య, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఉప్పల్ భరత్నగర్లోనే నివాసం ఉంటున్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పారిశ్రామికవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి బుధవారం సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. అనిల్ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. నాలుగు వారాల్లోగా ఎరిక్సన్ ఇండియాకు రూ.453 కోట్లు చెల్లించకపోతే మూడు నెలల పాటు జైలుకెళ్లాల్సి వస్తుందని పేర్కొంది.
న్యూఢిల్లీ: అయోధ్య కేసును ఈ నెల 26న సుప్రీం కోర్టు విచారించనుంది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారిస్తుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులు ఈ ప్రత్యేక బెంచ్లో ఉన్నారు. గత నెల 29న విచారణ ప్రారంభించాల్సి ఉండగా, న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే సెలవులో వెళ్లడంతో రద్దయింది.
అరకులోయ, ఫిబ్రవరి 20: మండలంలో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు గిరిజనులు మృత్యువాత పడినట్టు స్థానిక ఎస్.ఐ. అరుణ్కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మండలంలోని లోతేరు పంచాయతీ ధనసానివలస గ్రామంలో కల్తీకల్లు తాగిన ఐదుగురిలో ఇద్దరు గిరిజనులు మంగళవారం మృతి చెందినట్టు చెప్పారు.