S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/19/2019 - 23:26

అనకాపల్లిటౌన్, ఫిబ్రవరి 19:స్థానిక పూడిమడకరోడ్డుజెఎంజె స్కూల్ సమీపంలోమంగళవారం ఉదయం సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుకనుండి టిపర్‌లారీ డీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు. ట్రాఫిక్ ఎస్‌ఐ సోమునాయుడు అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.

02/19/2019 - 23:25

పాడేరు, ఫిబ్రవరి 19: పాడేరు ఆర్.టి.సి. డిపో మేనేజర్ రమేష్ కారును గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్థరాత్రి దగ్ధం చేసారు. స్థానిక స్టేట్ బ్యాంకు ఎదురుగా ఐ.టి.డి.ఎ. నూతనంగా నిర్మించిన క్వార్టర్లలో నివాసం ఉంటున్న డిపో మేనేజర్ తన కారును ఎప్పటివలే ఆరు బయట ఉంచడంతో సోమవారం రాత్రి రెండు గంటల సమయంలో కారు దగ్ధవౌతున్న విషయాన్ని కొందరు గుర్తించారు.

02/19/2019 - 23:16

తెనాలి, ఫిబ్రవరి 19: చిన్నానాటి స్నేహితులు దొంగతనాలు ప్రవృత్తిగా మార్చుకుని 38 సిలెండర్లు, ఎల్‌ఈడీ టీవీ, వెండి పట్టాలు, మిక్సీ అపహరించిన సంఘటన ఇది. తెనాలి డిఎస్పీ కథనం ప్రకారం తూములూరుకు చెందిన ఆటో డ్రైవర్ అమ్మిశెట్టి శివచందు, దావులూరిపాలెంకు చెందిన తుల్లిమిల్లి రవి చిన్నానాటి నుండి స్నేహితులు.

02/19/2019 - 22:57

విజయపురం, ఫిబ్రవరి 19: విజయపురం మండలంలోని సూరికాపరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మునిశేఖర్ మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కెవిబిపురం మండలంలోని కొత్తకండ్రిగ గ్రామంలో జేసీబీ ఆపరేటర్‌ను తీసుకురావడానికి మంగళవారం ఉదయం మునిశేఖర్ వెళ్లాడని తెలిపారు.

02/19/2019 - 22:57

ఏర్పేడు ఫిబ్రవరి 19: ఇంటి ముందు మురుగునీటి కాల్వను పూడ్చివేశారని ప్రశ్నించినందుకు పెద్దమ్మ కుమారుడిని పిన్నమ్మ కుమారులు పిడిగుద్దులు గుద్దడంతో, ఛాతీలో నొప్పి వచ్చి పెద్దమ్మ కుమారుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మర్రిమంద గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

02/19/2019 - 22:47

ఖమ్మం, ఫిబ్రవరి 19: దొంగతనాలు, లైగింకదాడులు లాంటి నేరాలు చేస్తూ పట్టుబడిన నేరస్థులు కాసుల రమేష్‌పై పీడీ యాక్టు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. మంగళవారం పోలీస్ అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సూరపల్లి గ్రామానికి చెందిన రమేష్‌పై హైదరాబాద్, రాచకొండ, ఖమ్మం కమిషనరేట్ పరిధిలో పలు కేసులున్నాయి.

02/19/2019 - 06:57

నంద్యాల రూరల్, ఫిబ్రవరి 18: ఓ గుత్తేదారుకు సంబంధించి నీరు చెట్టు పనుల బిల్లులు మంజూరుకు రూ.2 లక్షలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా గడివేముల ఇరిగేషన్ ఏఈ రాజశేఖర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. గుత్తేదారు రమణారెడ్డి తాను చేపట్టిన నీరు చెట్టు పనుల బిల్లుల కోసం నంద్యాల మైనర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ పరిధిలోని గడివేముల ఏఈ రాజశేఖర్‌ను కలవగా ఆయన రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడు.

02/19/2019 - 06:35

మొగల్తూరు, ఫిబ్రవరి 18: ఒక తల్లి తన ఇద్దరు కుమార్తెలను పీక నులిమి హత్యచేసి, ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో సోమవారం రాత్రి వెలుగుచూసింది. మృతురాలి భర్త తన భార్య ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడిందో తెలియడంలేదని చెబుతుంతగా, తమ అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడివుంటాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి...

02/19/2019 - 06:33

హైదరాబాద్, ఫిబ్రవరి 18: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య తర్వాత నిందితుడు రాకేశ్ రెడ్డి పలువురు పోలీసు అధికారులకు ఫోన్లు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాకేశ్ ఆ అధికారులకు ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

02/19/2019 - 06:33

ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 18: మద్యం మత్తులో కన్నతల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించి కడతేర్చిన ఓ తనయుడి దురాగతమిది. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కుసుమ ధనమ్మ(56)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త చనిపోయాడు. కూతురు, ఇద్దరు కుమారులకు వివాహమైంది. పెద్దకొడుకు కుసుమ రాము కొత్తగూడెంలో జీవనం సాగిస్తున్నాడు.

Pages