S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈమధ్య కొందరు హీరోయిన్స్ కేవలం సినిమాల్లో హీరోపక్కన నటించడమే కాకుండా నిర్మాతగా అడుగులేస్తూ సత్తాచాటుకుంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ భామలు ముందు వరసలో ఉన్నారు. తాజాగా సౌత్లో వాళ్ళను ఫాలోఅవుతున్న హీరోయిన్స్ కూడా పెరుగుతున్నారు. ఇప్పటికే క్రేజీ భామ సమంత కూడా నిర్మాతగా మారింది. ఇప్పుడు మరో మాజీ హీరోయిన్ కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని షాక్ అవుతున్నారా?
సౌత్ హాట్ భామ నయనతార భలే ప్లాన్ వేసిందబ్బా!! ఇప్పటికే ఈ అమ్మడు దర్శకుడు విఘ్నేష్ శివన్తో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఓ ఇంటివారు కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి షికార్లుచేయడం.. డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడు తన బాయ్ఫ్రెండ్ని హీరోగా పరిచయంచేసే పనిలో పడిందట!! తాజాగా విఘ్నేష్శివన్ ఓ మంచి కథను సిద్ధం చేసాడట.
నేచురల్ స్టార్ నాని ప్రయోగాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడనే సంగతి తెలిసిందే. వరుసగా 8 హిట్స్కొట్టిన నానికి కృష్ణార్జున యుద్ధం చిత్రం కాస్త నిరాశపరచింది. అయితే తన తదుపరి సినిమాతో మాత్రం పక్కా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అయితే నాని తదుపరి చిత్రాన్ని అవసరాల శ్రీనివాస్ లేదా విక్రమ కె.కుమార్ లేదా హనురాఘవపూడి లాంటి టాలెంట్ ఉన్న దర్శకులు తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతుంది.
‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ లాంటి మంచి చిత్రంలో నటించి అందరి హృదయాల్లో నటుడిగా మంచి స్థానం సంపాదించిన శేఖర్వర్మ హీరోగా, వివియ, విద్యలు హీరోయిన్స్గా, సతీష్ రేగళ్ళని దర్శకుడుగా పరిచయం చేస్తూ గాయత్రి ప్రొడక్షన్స్, దత్తాత్రేయా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్లో కె.ఎన్.రావు, టి.వి.వి.ఎస్.ఎన్.వర్మలు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రంనివాసి. ఇప్పటికే 75శాతం షూటింగ్ని పూర్తి చేసుకున్నారు.
ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో స్వాజిత్ మూవీస్ బ్యానర్పై రాజేష్, కె.ఆర్.నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను ఈనెల 22న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- చక్కటి కుటుంబ కథా చిత్రంగా, స్వచ్ఛమైన తెలుగు టైటిల్తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నందమూరి బాలకృష్ణ, నయనతార జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సికె ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సి.కల్యాణ్ నిర్మించిన ‘జైసింహా’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 21తో ఈ చిత్రం 100 రోజులు పూర్తిచేసుకోనుంది.
బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రం దుబాయ్లో షూటింగ్ జరుపుకుంటోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు వుంటారని ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో హీరోయిన్ కూడా ఎంపిక చేశారట. అయితే ఈసారి ప్రభాస్ సరసన హీరోయిన్గా అవకాశం కొట్టేసింది మరో బాలీవుడ్ భామ కావడం విశేషం.
వరుస విజయాలతో జోరుమీదున్న వరుణ్తేజ్ మరో సినిమాను మొదలుపెట్టాడు. ఘాజి చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంకల్ప్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. వరుణ్తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అతిథి రావు హైదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, క్రిష్, సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్ జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో జి.ఎ 2, యువి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘టాక్సీవాలా’. ఎస్.కె.ఎన్ నిర్మాత. ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. టీజర్ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ- ది ఎండ్ తరువాత నేను చేస్తున్న రెండో చిత్రమిది. ఇంత పెద్ద బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా వుంది.
సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించిన భరత్ అనే నేను’ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధమైన సందర్భంగా గురువారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పాటల రచయిత రామజోగయ్య శాస్ర్తీ మాట్లాడుతూ- నిజాయితీతో కూడిన ఒక అద్భుతమిది. కొరటాల శివతో మొదటినుంచీ ప్రయాణం చేస్తున్నాను.