S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బుల్లితెరపై ఎంతగానో అలరిస్తున్న హాట్ యాంకర్స్ వెండి తెరపై కూడా మంచి నటనతో ఆకట్టుకుంటున్నారు. గత కొంతకాలంగా జబర్దస్త్ షోలో కొనసాగుతోన్న హాట్ యాంకర్ అనసూయ ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ షోద్వారా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో మంచి ఆఫర్స్ను అందుకుంటూ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తోంది. క్షణం సినిమాలో క్లిక్ అయిన ఈ బ్యూటీ రంగస్థలం సినిమాతో మరింత క్రేజ్ అందుకుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీడ్ పెంచేసాడు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తికావొచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్లో మొదటి షెడ్యూల్ రేపటితో పూర్తికానుంది. ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
లేడీ సూపర్స్టార్ నయనతార నటించగా మలయాళంలో మంచి విజయం సాధించిన ‘ఎలెక్ట్ర’ చిత్రం తెలుగులో ‘లేడీ టైగర్’ పేరుతో విడుదల కానుంది. సురేష్ సినిమా పతాకంపై సి.ఆర్.రాజన్ సమర్పణలో సురేష్ దూడల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీమతి సరోజ సురేష్ సహ నిర్మాత. శ్యామ్ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ మనీషా కొయిరాల ముఖ్యపాత్ర పోషించగా..
సూపర్స్టార్ మహేష్, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘్భరత్ అనే నేను’. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటుచేసిన థాంక్స్ మీట్లో సూపర్స్టార్ మహేష్, కొరటాల శివ, కైరా అద్వానీ, దానయ్య డి.వి.వి., దేవిశ్రీ ప్రసాద్, బ్రహ్మాజీ, రామజోగయ్య శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.
‘ఎవడిగోల వాడిదే’ సినిమాతో టాలీవుడ్లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి, అటుపై అభిరుచిగల చిత్రాలను నిర్మిస్తూ తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ లగడపాటి శ్రీ్ధర్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు నిర్మించే ఈ బ్యానర్ నుండి తాజాగా వస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’.
వరుస పరాజయాల టెన్షన్నుండి తేజకు రిలీఫ్ ఇచ్చాడు హీరో రానా. తేజ దర్శకత్వంలో రానా నటించిన ‘నేనేరాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయం అందుకోవడంతో తేజకు మళ్లీ అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం మహానటుడు అన్న నందమూరి తారక రామారావు బయోపిక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ముప్ఫై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతోమంది స్టార్స్కు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన సీనియర్ ఫైట్మాస్టర్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా వి.ఎస్ క్రియేటివ్ వర్క్స్ బేనర్పై రూపొందుతున్న చిత్రానికి రాము కొప్పు దర్శకుడు, దివ్య విజయ్ నిర్మాత. లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఈ మాయ పేరేమిటో’ అనే టైటిల్ను ఖరారు చేశారు.
హీరో అల్లు శిరీష్ చివరగా చేసిన చిత్రం ‘ఒక్క క్షణం’ మంచి ఫలితానే్న అందుకుంది. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఒక మలయాళ సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. అదే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబిసిడి (అమెరి బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి) చిత్రం. నూతన దర్శకుడు సంజీవ్రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. జూన్నుండి షూటింగ్ మొదలుకానుంది.
‘కంచె’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత పలు చిత్రాలతో బిజీగా మారింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక ప్రగ్యా జైస్వాల్ చెప్పిన విశేషాలు..
బెస్ట్విన్ ప్రొడక్షన్ పతాకంపై భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రుణం’. ఈ చిత్రంతో గోపీకృష్ణ-మహేంద్ర హీరోలుగా పరిచయమవుతుండగా.. శిల్ప, తేజు, ప్రియాంక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రదీప్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఎస్.వి.మల్లిక్ తేజ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యింది.