S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అందాలతార తాప్సి నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘నామ్ షబానా’ త్వరలో విడుదల కానుంది. ఆ చిత్ర బృందంతో కలసి ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తాప్సి ప్రేక్షకులను అలరించింది.
ముంబైలో నిర్వహించిన ‘రంగూన్’ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కంగనారనౌత్ ఆహూతులను అలరించింది. ప్రఖ్యాత డిజైనర్ బిభుపాత్ర రూపొందించిన దుస్తుల్లో ఆమె హొయలొలికించింది. సైఫ్ అలీఖాన్, షాహిద్కపూర్లతో కలసి కంగన నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది.
దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం చేస్తున్న ‘రోగ్’ చిత్రంలో ఇషాన్ హరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. ఈ చిత్రాన్ని హిందీలో సల్మాన్ఖాన్ రీమేక్ చేయనున్నాడట. అయితే ఆ సినిమాలో సల్మాన్ఖాన్ హీరోగా నటించకుండా సూరజ్ పంచోలిని కథానాయకుడిగా ఎన్నుకున్నారని సమాచారం. ఎప్పటినుంచో పూరి-సల్మాన్ఖాన్లు మంచి స్నేహితులు.
హాలీవుడ్ చిత్రం ‘టిప్రుల్ ఎక్స్-రిటర్న్ ఆఫ్ గ్జాండర్కేజ్’ ప్రమోషన్ కార్యక్రమాలు బీజింగ్లో ఉధృతంగా సాగుతున్నాయి. ఆ చిత్రంలో నటించిన హాలీవుడ్ హీరో విన్ డీసెల్, బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనె, చిత్రం బృందం పలు కార్యక్రమాల్లో పాల్గొని సినీ అభిమానులు అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ప్రఖ్యాత డిజైనర్ రాల్ఫ్ లారెన్ రూపొందించిన తెల్లటి దుస్తుల్లో మెరిసిపోయింది.
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున-కె.రాఘవేంద్రరావుల కాంబినేషన్లో సాయికృపా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఓం నమో వేంకటేశాయ చిత్రం శుక్రవారం విడుదలై అన్ని కేంద్రాల్లో మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల కోసం ఒక రోజు ముందుగానే హైదరాబాద్లో ప్రివ్యూ షోను ప్రదర్శించారు. ఈ షోను చూసిన మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ- ‘ఈ సినిమా చూడడమే అద్భుతమైన ఎక్స్పీరియన్స్లా వుంది.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో రూపొందిస్తున్న ‘రంగూన్’ చిత్రం సందర్భంగా ఒకే కాటేజ్ని హీరో షాహిద్కపూర్తో గడపడం పీడకలేనని హీరోయిన్ కంగనా రనౌత్ అన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కంగనా నోరువిప్పారు. ‘ఆ చిత్రం కోసం అరుణాచల్ ప్రదేశ్లోని కొండకోనల్లో మారుమూల ప్రాంతాల్లో షూటింగ్కు వెళ్లాల్సి వచ్చేది. అక్కడికక్కడ, అప్పటికప్పుడు వేసే గుడారాల్లో ఉండాల్సి వచ్చేది.
ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్రామ్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగింది. దేవుడి పటాలపై ఎన్టీఆర్ క్లాప్నివ్వగా హరికృష్ణ స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
శ్రీపాద ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనీల్ బూరగాని, నేహా దేశ్పాండే, నికిత ప్రధాన తారాగణంగా పి.రాధాకృష్ణ దర్శకత్వంలో కిషోర్ కుమార్ కోట రూపొందించిన సినిమా ‘వజ్రాలు కావాలా నాయనా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 17న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.
వరుసగా రెండు సినిమాలు మొదలెట్టిన మాస్ మహారాజ్ రవితేజ రేస్లోకి వచ్చేశాడు అంటున్నారు. ‘టచ్చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో రవితేజ తన ఫామ్లోకి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా సినిమాలు మొదలుపెట్టాడు. విక్రం సిరికొండ డైరెక్షన్లో వస్తున్న టచ్ చేసి చూడు షూటింగ్ ఇంకా మొదలవకుండానే రవితేజకి షాక్ ఇచ్చింది హీరోయిన్.
తెలుగు ప్రజల అన్నగారు నందమూరి తారక రామారావుమీద సినిమా అనగానే అందరికీ ఎక్కడలేని సంతోషం. నందమూరి ఫాన్స్- టిడిపి వర్గాల్లో అయితే పదింతలు ఈ సంతోషం కనబడుతోంది. బాలయ్య స్వయంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ సినిమా పక్కాగా రాబోతోంది అంటున్నారు. ఎన్టీఆర్ పాత్రని తానే పోషిస్తా అంటూ బాలయ్య చెప్పిన తీరుతో ఇప్పటికే స్క్రిప్ట్ కథ జరుగుతోందట.