S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆమధ్య ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ‘తూనీగ తూనీగ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రియా చక్రవర్తికి ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పాపం ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. తరువాత ఒకటి రెండు సినిమాలు చేసిన ఈ అమ్మడికి ఇక్కడ వర్కవుట్ కాదని తెలుసుకుని బాలీవుడ్కి చెక్కేసింది. అక్కడ గట్టి ప్రయత్నాలే చేసినా పెద్దగా లాభం లేకపోయింది.
‘పీకే’, ‘దంగల్’ వంటి చిత్రాలతో బాలీవుడ్ సూపర్హిట్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు అమీర్ఖాన్. మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా తెరకెక్కి గతేడాది విడుదలైన ‘దంగల్’ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో అమీర్ మరో బయోపిక్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యోమగామి రాకేష్ శర్మగా అమీర్ కనిపించబోతున్నారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మ చరిత్ర సృష్టించారు.
శ్రీ సిద్ధి సెవెన్హిల్స్ పతాకంపై అర్జున్, క్రాంతిచంద్, అవితేజ్, కోయల్దాస్, ప్రదీప్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధనశ్రీనివాస్ జామి, లక్ష్మీవెంకటరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘చంద్రుడిలో ఉండే కుందేలు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు.
గ్లామర్ భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం పవన్కల్యాణ్ సరసన ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు కమల్హాసన్ నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ సినిమాలో మాత్రమే నటిస్తోంది. తండ్రి సినిమా కోసం వేరే సినిమాల కమిట్మెంట్స్ ఏవీ పెట్టుకోని ఈ అమ్మడు ఆ సినిమా పూర్తవడంతో ఇప్పుడు స్పీడ్ పెంచింది. లేటెస్టుగా ఓ భారీ బడ్జెట్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
పవన్కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిశోర్ పార్థాసాని దర్శకత్వంలో శరత్ మరార్ రూపొందిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు దశలో వుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ను మంగళవారం విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఆదరణ సాక్ష్యంగా నిలుస్తోందని, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని దర్శకుడు తెలియజేశారు.
లేటెస్టుగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన క్రిష్, ఆ సినిమాతో బాలయ్యను యాభై కోట్ల మార్కెట్లోకి చేర్చింది. ఈ సినిమాతో ఓవర్సీస్ మార్కెట్లో కూడా క్రేజ్ దక్కి ఏకంగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అఖండ భారతాన్ని పాలించిన తెలుగు చక్రవర్తి శాతకర్ణి కథను తెలుగు ప్రేక్షకులకు అందించిన క్రిష్ ఇప్పుడు మరో రెండు చారిత్రక సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు?
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన నటింన ‘మన్యం పులి, ఒప్పం’ వంటి సినిమాలు మలయాళంలోనే కాక తెలుగు, తమిళంలో సైతం సూపర్హిట్లవడంతో ఆయన సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది. ఈ తరుణంలో ఆయన తన సినిమాల్లోకి ఇతర భాషా నటీనటుల్ని కూడా తీసుకుంటూ ఆ క్రేజ్ను మరింతగా పెంచుతున్నారు.
ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం.అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం మూడవ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తొంభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘మీ శ్రేయోభిలాషి’ వంటి ఉత్తమాభిరుచిగల చిత్రాలకు సంభాషణలు సమకూర్చిన రమేష్ చెప్పాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, డా రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్ ఎస్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘డి.జె’ (దువ్వాడ జగన్నాథమ్) చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ ఈనెల 18న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాజు మాట్లాడుతూ- గతంలో తమ సంస్థ రూపొందించిన ‘ఆర్య’, ‘పరుగు’ చిత్రాల స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.
సాయిధరమ్ తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్ను ఇటీవల యూట్యూబ్లో విడుదల చేశారు.