S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అభ్యుదయ చిత్రాల దర్శకుడిగా తెలుగు తెరపై తనదైన ప్రత్యేకతను చాటుకున్న సీనియర్ దర్శకుడు టి.కృష్ణ జీవిత కథతో సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన ‘వెండితెర అరుణకిరణం టి.కృష్ణ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ప్రము ఖ దర్శకుడు దాసరి నారాయణరావు పుస్తకాన్ని ఆవిష్కరించి హీరో గోపీచంద్కు అందజేశారు.
ప్రస్తుతం ఈ వార్త మీడియా వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. రెండు భిన్న కోణాల హీరోలతో కలిపి మల్టీస్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట ఓ క్రేజీ దర్శకుడు. ఈ సినిమా కనుక సెట్స్పైకి వచ్చిందంటే నిజంగా సంచలనమనే చెప్పాలి. తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్, ఇక మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్లతో ఈ సినిమా రూపొందించనున్నారట.
తాజాగా త్రివిక్రమ్, పవన్కల్యాణ్ల సంయుక్త నిర్మాణంలో కృష్ణచైతన్య దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ చేసి సంచలనం సృష్టించిన యంగ్ హీరో నితిన్, ఈమధ్య దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా వైవిధ్యమైన రొమాంటిక్ లవ్స్టోరీగా ఉండబోతోంది.
తమిళంలో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ ఏస్థాయితో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగులోనూ హీరోగా తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్న ఆయన నటించిన ‘సింగం-3’ వచ్చే నెలలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే సూర్య అప్పుడే రెండు కొత్త సినిలను మొదలుపెట్టేశాడు.
‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్గా నిలిచిపోయిన నటి అనుష్క ప్రస్తుతం చేస్తున్న మరో ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం అక్టోబర్లో మొదలైంది. ఈ చిత్రంలో అనుష్క పాత్ర, నటన హైలెట్గా నిలుస్తాయని, కథ కూడా వైవిధ్యంగా కొత్తగా వుంటుందని మొదటినుండీ చిత్ర యూనిట్ చెబుతూ వస్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.
లేటెస్టుగా ‘జెంటిల్మన్’, ‘మజ్ను’ సినిమాల తరువాత ‘నేను లోకల్’ చిత్రంలో నటిస్తున్నాడు నాని. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మరో భిన్నమైన సినిమా చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి ఓకె చెప్పాడట. ఈ చిత్రం ద్వారా శివకుమార్ అనే దర్శకుడు పరిచయం కానున్నాడు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 23న ప్రారంభం కానుందట.
తెలుగు సినిమాల్లో స్టార్లు గాయకులవడం మనం చూస్తున్నదే. ఇప్పుడు సింగర్ హీరోయిన్గా మారడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. టాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న గీతా మాధురి హీరోయిన్గా నటించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఇంతకుముందు షార్ట్ ఫిలింస్లో నటించిన అనుభవమున్న గీతామాధురి, ఓ తమిళ దర్శకుడు రూపొందిస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
ముంబైలో జరిగిన ఓ విందు కార్యక్రమానికి హాజరైన అలనాటి అందాల భామలు రేఖ, మాధురి దీక్షిత్ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రఖ్యాత కంచిపట్టుచీరతో రేఖ కళకళలాడుతూ కన్పిస్తే అందమైన ఫ్యాన్సీ చీరతో మాధురి
అలరించింది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ ఫైట్ హైలెట్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలియజేసింది.
శివకార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత రాజు అందిస్తున్న చిత్రం రెమో. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.