-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
కర్నాటక: కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని అన్నారు. 2014 ఎన్నికల్లో మోదీ తాను ఇచ్చిన హామీలను అమలుచేయటంలో విఫలమయ్యారని విమర్శించారు. కర్నాటకలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ కాదని అన్నారు.
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు విపక్షాలు నోటీసుల జారీ చేశాయి. ఈమేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు నోటీసు అందించాయి. ఈ నోటీసుపై 71మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి.
హైదరాబాద్:రాజకీయ తీర్మానాన్ని ఫైనల్ చేసే ప్రక్రియ ఆరంభమైందని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజకీయ ముసాయిదా తీర్మానంపై చర్చ మంచి వాతావరణంలో జరిగింది. 47మంది ప్రతినిధులు ఈ తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. పోలీట్బ్యూరో ఆర్గనేజేషన్లో రేపు దీనిపై చర్చ జరుగుతుందని వెల్లడించారు. స్టీరింగ్ కమిటీ అభిప్రాయాలను పరగణలోకి తీసుకుంటుంది.
జమ్మూ : కతువాలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబానికి మరో అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జమ్మూ-కశ్మీరు ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ విలేకర్లతో మాట్లాడుతూ తాను ఈ ఆడియో క్లిప్ను విన్నానని చెప్పారు. దీనిపై దర్యాప్తు జరపాలని ఆదేశించానని చెప్పారు.
న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం ఆస్తులను జప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ముంబైలోని దావూద్ ఆస్తులను జప్తు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ ఆర్ కే అగర్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
న్యూఢిల్లీ : గుజరాత్ అల్లర్ల కేసులో భారతీయ జనతా పార్టీ మాజీ మంత్రి మాయా కొద్నానీ నిర్దోషిగా విడుదల అయ్యారు. 2002 గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో అహ్మదాబాద్లోని నరోదా పటియాలో నరమేథం జరిగింది. ఈ నరమేథం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాయా కొద్నానీని శుక్రవారం గుజరాత్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సంశయ లాభం కింద కొద్నానీని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.
అగర్తాలా: త్రిపురలోని ఖోవై జిల్లాలో 18 మంది రోహింగ్యా శరణార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ముగ్గురు చిన్నారులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినందునే వీరిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: సొహ్రాబుద్దీన్ కేసును విచారించిన న్యాయమూర్తి బీహెచ్ లోయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ల వెనక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నారని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయ అనుమానాస్పద మరణం కేసులో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేయటం పట్ల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్సింగ్ సుర్జేవాలా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
కురుక్షేత్ర, ఏప్రిల్ 19: దేశంలో విదేశీయుల పాలన వల్ల భారత సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిచిపోయాయని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళలకు సరైన గౌరవం దక్కకుండాపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కురుక్షేత్ర విశ్వవిద్యాలయం 30వ స్నాతకోత్సవంలో ఉప రాష్టప్రతి మాట్లాడుతూ ‘దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళను గౌరవించాలి’ అని పిలుపునిచ్చారు.