S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/30/2015 - 18:51

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ను బుధవారం ఐసీయూకు తరలించారు. సయీద్ కు ఆక్సిజన్ థెరఫీ అవసరమని, వైద్య నిపుణుల బృందం ఆయన పరిస్థితిని సమీక్షిస్తోందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. 79 ఏళ్ల సయీద్ స్పృహలో ఉన్నారని వైద్యులు చెప్పారు.

12/30/2015 - 18:47

ముంబయి :మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. ముంబయి, అహ్మద్‌నగర్, ధూలే-నందర్బార్, అకోలా-వాషిమ్ -బుల్ధానా, సోలాపూర్, కొల్హాపూర్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 8 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు గెలుచుకుంది. శివసేన రెండు, బీజేపీ, ఎన్సీపీ చెరోసీటు కైవసం చేసుకోగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు.

12/30/2015 - 17:29

న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు బీజేపీ బహిష్కృత ఎంపీ కీర్తి ఆజాద్ లపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు బుధవారం డీడీసీఏ ప్రకటించింది. అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డీడీసీఏలో అక్రమాలు, అవినీతి జరిగాయని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

12/30/2015 - 16:24

న్యూఢిల్లీ : పొరుగు దేశం మయన్మార్‌లో 69 బ్రిడ్జిలను నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రూ.371.58 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు.

12/30/2015 - 16:22

వార్కళ (కేరళ) : అన్ని మతాలనూ సమ భావంతో ఆదరించాలనీ, మత సహనం ఉండాలని నారాయణ గురు ప్రబోధించారని సోనియా గాంధీ పేర్కొన్నారు. నారాయణ గురు 83వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ మహాపురుషుల బోధనలకు మతం రంగు పులమడమే కాకుండా సమాజంలో ఏహ్య భావాన్ని పెంపొందించేందుకు కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.

12/30/2015 - 16:21

ముంబై: ఓ మహిళను వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించిన కేసులో 11 మహిళలు, మరో నిందితుడికి ముంబై కోర్టు రెండేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. 2010 జూన్ లో ముంబై సెవ్రీ ప్రాంతంలో నిందితులు బాధితురాలిపై దాడి చేసి ఘోరంగా అవమానించారు.

12/30/2015 - 16:14

కాన్పూర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ విద్యకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయి. ఈమేరకు వాజ్‌పేయ్ విద్యా రికార్డులను చూపించాలని డిమాండ్ చేస్తూ ఛత్రపతి సాహు జీ యూనివర్సిటీ (సీఎస్‌జేఎంయూ) వైస్ ఛాన్సెలర్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగాయి.

12/30/2015 - 14:27

న్యూఢిల్లీ : భారత్, ఇజ్రాయిల్ సంయుక్తంగా రూపొందించిన బారక్-8 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఉపరితలం నుంచి గగనతలం వరకు గల సుదూర లక్ష్యాలను ఈ క్షిపణ ఛేదించగలదు.

12/30/2015 - 14:27

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా మధ్యప్రదేశ్‌లో వాహన కాలుష్య నివారణ చర్యలు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 15 సంవత్సరాల పైబడిన వాహనాలను నిషేధించింది. పాత వాహనాలతో కాలుష్యం ఎక్కువ అవుతుందనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆ రాష్ట్ర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి భూపేందర్ సింగ్ వెల్లడించారు.

12/30/2015 - 14:26

చెన్నై : చెన్నైలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు అతలాకుతలమైన వరద బాధితులకు పోకిరీరాజ చిత్రంలో నటించిన నటీ నటులు సరకులను పంపిణీ చేశారు. నటులు జీవా, సిబీరాజ, నటి హన్సికా తదితరులు ఈ సరుకులను పంపిణీ చేశారు. ఈ మేరకు నటుడు జీవా పేస్‌బుక్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు.

Pages