అప్పన్న సేవలో కంచిస్వామి
Published Wednesday, 23 November 2016సింహాచలం, నవంబర్ 22: కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి మహాస్వాములు మంగళవారం సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కె. రామచంద్రమోహన్ అర్చక పరివారంతో కలిసి స్వాములకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయం బేడమండపంలో ప్రదక్షిణ చేసిన స్వాములు అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. గోదాదేవి సన్నిధిలో స్వాములు హారతులు స్వీకరించారు. అనంతరం నాదస్వర వాయిద్యాలు, పండితుల మంత్రోచ్చరణల నడుమ అర్చకులు వేద స్వస్తి పలికారు. ఈవో స్వామీజీలకు ప్రసాదాలను, శేషవస్త్రాలను, సింహాచలేశుని చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.