నటీమణుల కబడ్డీ
Published Thursday, 9 June 2016టాలీవుడ్లో నటీమణుల కబడ్డీ నిర్వహిస్తున్నామని విక్రం ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు కె.విక్రమాదిత్య తెలిపారు. దాదాపు 35మంది నటీమణులతో తొలిసారిగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ ఆలోచన కొత్తగా వుండడంతో టీవీ ఆర్టిస్టులు కూడా ఈ పోటీలో పాల్గొననున్నారని, జూలై నెలలో ఈ కార్యక్రమం జరుగుతుందని కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పోటీలలో తానూ పాల్గొనడం ఆనందంగా వుందని, మంచి పేర్లతో టీమ్లను తయారుచేస్తున్నామని, ఝాన్సీ లక్ష్మీభాయి, రాణీ రుద్రమదేవి, మాంచాల, రజియా సుల్తానా వంటి పేర్లు పరిశీలిస్తున్నామని నటి కవిత తెలిపారు.