చత్తీస్గఢ్లో మావోల మెరుపుదాడి
Published Thursday, 9 June 2016రాయ్పూర్: చత్తీస్గఢ్లోని రణ్పాల్ అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ శిబిరంపై సుమారు వందమంది మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. కాసేపటికి తేరుకున్న సాయుధ జవాన్లు కూడా మావోలపై కాల్పులు జరిపారు. ఇరుపక్షాల మధ్య చాలాసేపు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కొందరు జవాన్లు, మావోలు గాయపడ్డారని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.