జూపల్లి వర్సెస్ రేవంత్..!
Published Thursday, 9 June 2016మహబూబ్నగర్: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగానికి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డుతగలడంతో కాసేపు ఉద్రిక్తత కొనసాగిన ఘటన కోస్గి మండలం బోగారంలో గురువారం జరిగింది. రహదారి పనుల ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో జూపల్లి మాట్లాడుతూ, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు ప్రాజెక్టు ఆగదని పరోక్షంగా టిడిపి అధినేత చంద్రబాబును విమర్శించారు. దీంతో రేవంత్ మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. టిడిపి కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.