శాంతి భద్రతల పరిరక్షణకు రూ. 350కోట్లు
Published Thursday, 9 June 2016షాద్నగర్/కొందుర్గు, జూన్ 9: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సిఎం కెసిఆర్ 350కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం కొందుర్గు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నర్సింహరెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించేందుకు సిఎం కెసిఆర్ పెద్దపీట వేయడం జఠిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 550పోలీస్ స్టేషన్లకు కొత్తవాహనాలను ఇవ్వడం జరిగిందని, అలాగే హైద్రాబాద్, వరంగల్ పట్టణాలకు సాంకేతిక పరిజ్ఞానంతో కలిగి వాహనాలను ఇచ్చినట్లు పేర్కొన్నారు.