వీరభద్రసింగ్ను ప్రశ్నించిన సిబిఐ
Published Thursday, 9 June 2016దిల్లీ: అక్రమాస్తులకు సంబంధించి సిబిఐ అధికారులు గురువారం ఇక్కడ జరిపిన విచారణకు హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ హాజరయ్యారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాచారం అందజేశారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై వీరభద్రసింగ్, ఆయన భార్య ప్రభావతితో పాటు మరికొందరిపైనా కేసులు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరుపుతోంది.